టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పానికి ఇటీవల కాలంలో తరచుగా వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఏకంగా ఎనిమిది సార్లు ఆయన(అరెస్టుకు ముందు) కుప్పంలో పర్యటించారు. వైసీపీ అధిష్టానం కుప్పం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూస్తుండడం.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా ఓడిస్తామని పార్టీ నాయకులు పదే పదే ప్రకటన చేస్తున్న దరిమిలా.. చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అదేసమయంలో కుప్పంలో టీడీపీ నాయకులపై పెడుతున్న కేసుల విషయంపై కూడా ఆయన ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా మరోసారి చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు. అయితే.. ఇది వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి పర్యటనగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు మాసాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి తొలి లేదా రెండో వారంలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పొత్తులు ఖరారు చేసుకోవడంతో పాటు అభ్యర్థులను ప్రకటించాలి. అదేసమయంలో జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేయాలి. దీంతో చంద్రబాబు సహజంగానే బిజీ అయిపోతారు. ఇక, సంక్రాంతి సమయంలో ఆయన సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరికి వెళ్లనున్నారు.
మొత్తంగా చూస్తే.. వచ్చే ఎన్నికలకు ముందు ఇప్పుడు జరుగుతున్న కుప్పం పర్యటనే చివరిదని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పాటు సొంత నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. ప్రచారం.. జనసేన నేతలతో కలిసి ప్రయాణం చేయడం.. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న చిన్నపాటి వివాదాలను సరిచేసుకోవడం వంటివిషయాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా కుప్పం టీడీపీ నాయకులను చంద్రబాబు ఎన్నికలకు రెడీ చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుంటే.. గత మూడురోజులుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ప్రత్యేక యాగం ముగియడంతో చంద్రబాబు హైదరాబాద్కు బయలు దేరారు. సోమ, మంగళ, బుధవారాల్లో హైదరాబాద్లోనే చంద్రబాబు ఉండనున్నారు. ఈ నెల 28వ తేదీన చంద్రబాబు కుప్పం వెళ్తారు. అక్కడే మూడు రోజుల పాటు ఉండనున్నారు. ఎన్నికలకు ముందు ఇదే కుప్పం చివరి పర్యటన కానుండడంతో చంద్రబాబు పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
This post was last modified on December 25, 2023 1:16 pm
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…