Political News

ఎన్నిక‌ల‌కు ముందు ఆఖ‌రిసారి కుప్పానికి..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లా కుప్పానికి ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వెళ్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాదిలో ఏకంగా ఎనిమిది సార్లు ఆయ‌న(అరెస్టుకు ముందు) కుప్పంలో ప‌ర్య‌టించారు. వైసీపీ అధిష్టానం కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌త్యేకంగా చూస్తుండ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును కూడా ఓడిస్తామ‌ని పార్టీ నాయ‌కులు ప‌దే ప‌దే ప్ర‌క‌ట‌న చేస్తున్న ద‌రిమిలా.. చంద్ర‌బాబు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అదేస‌మ‌యంలో కుప్పంలో టీడీపీ నాయ‌కుల‌పై పెడుతున్న కేసుల విష‌యంపై కూడా ఆయ‌న ప్ర‌త్యేకంగా ప‌రిశీలిస్తున్నారు.

ఇదిలావుంటే.. తాజాగా మ‌రోసారి చంద్ర‌బాబు కుప్పం ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. అయితే.. ఇది వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న చివ‌రి ప‌ర్య‌ట‌న‌గా టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రో రెండు మాసాల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కానుంది. మార్చి తొలి లేదా రెండో వారంలోనే షెడ్యూల్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో పొత్తులు ఖ‌రారు చేసుకోవ‌డంతో పాటు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాలి. అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌-టీడీపీ ఉమ్మ‌డి బ‌హిరంగ స‌భ‌ల‌కు కూడా ప్లాన్ చేయాలి. దీంతో చంద్ర‌బాబు స‌హ‌జంగానే బిజీ అయిపోతారు. ఇక‌, సంక్రాంతి స‌మయంలో ఆయ‌న సొంతూరు చిత్తూరు జిల్లా చంద్ర‌గిరికి వెళ్ల‌నున్నారు.

మొత్తంగా చూస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు ఇప్పుడు జ‌రుగుతున్న కుప్పం ప‌ర్య‌ట‌నే చివ‌రిద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నా యి. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పాటు సొంత నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాలు.. ప్ర‌చారం.. జ‌న‌సేన నేత‌ల‌తో క‌లిసి ప్ర‌యాణం చేయ‌డం.. క్షేత్ర‌స్థాయిలో కొన‌సాగుతున్న చిన్న‌పాటి వివాదాల‌ను స‌రిచేసుకోవ‌డం వంటివిష‌యాల‌పై ఆయ‌న దిశానిర్దేశం చేయ‌నున్నారు. మొత్తంగా కుప్పం టీడీపీ నాయ‌కుల‌ను చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు రెడీ చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుంటే.. గ‌త మూడురోజులుగా ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో జరిగిన ప్ర‌త్యేక యాగం ముగియడంతో చంద్రబాబు హైద‌రాబాద్‌కు బ‌య‌లు దేరారు. సోమ‌, మంగ‌ళ‌, బుధ‌వారాల్లో హైదరాబాద్‌లోనే చంద్రబాబు ఉండనున్నారు. ఈ నెల 28వ తేదీన చంద్రబాబు కుప్పం వెళ్తారు. అక్క‌డే మూడు రోజుల పాటు ఉండ‌నున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ఇదే కుప్పం చివ‌రి ప‌ర్య‌ట‌న కానుండ‌డంతో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది.

Satya

Recent Posts

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

15 minutes ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

1 hour ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

2 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

3 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

3 hours ago

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

5 hours ago