రాబోయే ఎన్నికల్లో కొందరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వబోనని ఆ పార్టీ అధినేత జగన్ కరాఖండిగా చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 మంది సిట్టింగ్ ల స్థానాలు మార్చిన జగన్ ..త్వరలోనే మరో 70 మందికి స్థాన చలనం కల్పించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంత జరుగుతున్నా..వైసీపీ నేతలు మాత్రం వై నాట్ 175 అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీపై ఆ పార్టీ మాజీ నేత..ప్రస్తుతం జనసేన నేత, కమెడియన్ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజంగా 175కి 175 స్థానాల్లో విజయం లభించే అవకాశం వైసీపీకి ఉంటే దాదాపు 92 చోట్ల అభ్యర్థులను ఎందుకు మార్చుతున్నారని ప్రశ్నించారు. 2024ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, మరికొద్ది నెలల్లో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని అన్నారు. ఈ సారి టీడీపీ-జనసేన కూటమిదే అధికారం అని పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు. ఆ కూటమి 135 ఎమ్మెల్యే స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో 100 రోజుల తర్వాత ఏపీలో సుపరిపాలన ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు.
మంత్రి అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ షోలు చేసుకోవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. బ్రో సినిమాలో అంబటి రాంబాబు క్యారెక్టర్ ను శ్యాంబాబుగా పేరు మార్చి పెట్టారని నానా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబటిపై పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…