రాబోయే ఎన్నికల్లో కొందరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వబోనని ఆ పార్టీ అధినేత జగన్ కరాఖండిగా చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 మంది సిట్టింగ్ ల స్థానాలు మార్చిన జగన్ ..త్వరలోనే మరో 70 మందికి స్థాన చలనం కల్పించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంత జరుగుతున్నా..వైసీపీ నేతలు మాత్రం వై నాట్ 175 అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీపై ఆ పార్టీ మాజీ నేత..ప్రస్తుతం జనసేన నేత, కమెడియన్ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజంగా 175కి 175 స్థానాల్లో విజయం లభించే అవకాశం వైసీపీకి ఉంటే దాదాపు 92 చోట్ల అభ్యర్థులను ఎందుకు మార్చుతున్నారని ప్రశ్నించారు. 2024ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, మరికొద్ది నెలల్లో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని అన్నారు. ఈ సారి టీడీపీ-జనసేన కూటమిదే అధికారం అని పృథ్వీ ధీమా వ్యక్తం చేశారు. ఆ కూటమి 135 ఎమ్మెల్యే స్థానాల్లో, 25 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో 100 రోజుల తర్వాత ఏపీలో సుపరిపాలన ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు.
మంత్రి అంబటి రాంబాబు ఓడిపోతే జబర్దస్త్ షోలు చేసుకోవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. బ్రో సినిమాలో అంబటి రాంబాబు క్యారెక్టర్ ను శ్యాంబాబుగా పేరు మార్చి పెట్టారని నానా రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబటిపై పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
This post was last modified on December 24, 2023 11:00 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…