Political News

పురందేశ్వరి కొడుకు కోసం బాబు త్యాగం

వదిన పురందేశ్వరి తనయుడి గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? ఆయన గెలుపు కోసం బాబు ఓ నియోజకవర్గాన్ని త్యాగం చేయబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో తనయుడు హితేష్ చెంచురామ్ ను బరిలో దించాలని చూస్తున్నారని తెలిసింది. కొడుకు రాజకీయ ప్రవేశం కోసం ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వదిన గారి అబ్బాయి కోసం బాబు కూడా మద్దతుగా నిలుస్తున్నారని టాక్.

బాపట్ల జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హితేష్ ను పోటీ చేయించాలని పురందేశ్వరి అనుకుంటున్నారని తెలిసింది. అక్కడ హితేష్ అరంగేట్రం కోసం ఆమె రంగం సిద్ధం చేస్తున్నారని టాక్. కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు వరుసగా రెండు సార్లు గెలిచారు. 2019లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా సాంబశివరావు విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై సాంబశివరావు నెగ్గారు. అంతకుముందు 1985, 1989లో టీడీపీ నుంచి.. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి దగ్గుబాటి వేంకటేశ్వరావు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు కొడుకు హితేష్ ను బరిలో దించేందుకు సిద్ధమయ్యారు.

అయితే తమకు మంచి పట్టు ఉన్న పర్చూరు నియోజకవర్గాన్ని బాబు వదులుకోవడానికి సిద్ధం కావడమే ఇక్కడ గమనార్హం. పురందేశ్వరి కోసమే బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. 2024 ఎన్నికల్లో సాంబశివరావును ఇక్కడి నుంచి తప్పించి, చీరాలకు పంపించే అవకాశముందని టాక్. అంతే కాకుండా టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా హితేష్ ను పర్చూరులో పోటీ చేయించేలా పురందేశ్వరి మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇలా ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె నమ్ముతున్నారని టాక్. 

This post was last modified on December 24, 2023 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

4 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

7 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

7 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

9 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

10 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

10 hours ago