వదిన పురందేశ్వరి తనయుడి గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? ఆయన గెలుపు కోసం బాబు ఓ నియోజకవర్గాన్ని త్యాగం చేయబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో తనయుడు హితేష్ చెంచురామ్ ను బరిలో దించాలని చూస్తున్నారని తెలిసింది. కొడుకు రాజకీయ ప్రవేశం కోసం ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వదిన గారి అబ్బాయి కోసం బాబు కూడా మద్దతుగా నిలుస్తున్నారని టాక్.
బాపట్ల జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హితేష్ ను పోటీ చేయించాలని పురందేశ్వరి అనుకుంటున్నారని తెలిసింది. అక్కడ హితేష్ అరంగేట్రం కోసం ఆమె రంగం సిద్ధం చేస్తున్నారని టాక్. కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు వరుసగా రెండు సార్లు గెలిచారు. 2019లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా సాంబశివరావు విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై సాంబశివరావు నెగ్గారు. అంతకుముందు 1985, 1989లో టీడీపీ నుంచి.. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి దగ్గుబాటి వేంకటేశ్వరావు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు కొడుకు హితేష్ ను బరిలో దించేందుకు సిద్ధమయ్యారు.
అయితే తమకు మంచి పట్టు ఉన్న పర్చూరు నియోజకవర్గాన్ని బాబు వదులుకోవడానికి సిద్ధం కావడమే ఇక్కడ గమనార్హం. పురందేశ్వరి కోసమే బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. 2024 ఎన్నికల్లో సాంబశివరావును ఇక్కడి నుంచి తప్పించి, చీరాలకు పంపించే అవకాశముందని టాక్. అంతే కాకుండా టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా హితేష్ ను పర్చూరులో పోటీ చేయించేలా పురందేశ్వరి మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇలా ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె నమ్ముతున్నారని టాక్.
This post was last modified on December 24, 2023 9:29 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…