Political News

పురందేశ్వరి కొడుకు కోసం బాబు త్యాగం

వదిన పురందేశ్వరి తనయుడి గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? ఆయన గెలుపు కోసం బాబు ఓ నియోజకవర్గాన్ని త్యాగం చేయబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో తనయుడు హితేష్ చెంచురామ్ ను బరిలో దించాలని చూస్తున్నారని తెలిసింది. కొడుకు రాజకీయ ప్రవేశం కోసం ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వదిన గారి అబ్బాయి కోసం బాబు కూడా మద్దతుగా నిలుస్తున్నారని టాక్.

బాపట్ల జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హితేష్ ను పోటీ చేయించాలని పురందేశ్వరి అనుకుంటున్నారని తెలిసింది. అక్కడ హితేష్ అరంగేట్రం కోసం ఆమె రంగం సిద్ధం చేస్తున్నారని టాక్. కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు వరుసగా రెండు సార్లు గెలిచారు. 2019లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా సాంబశివరావు విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై సాంబశివరావు నెగ్గారు. అంతకుముందు 1985, 1989లో టీడీపీ నుంచి.. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి దగ్గుబాటి వేంకటేశ్వరావు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు కొడుకు హితేష్ ను బరిలో దించేందుకు సిద్ధమయ్యారు.

అయితే తమకు మంచి పట్టు ఉన్న పర్చూరు నియోజకవర్గాన్ని బాబు వదులుకోవడానికి సిద్ధం కావడమే ఇక్కడ గమనార్హం. పురందేశ్వరి కోసమే బాబు ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. 2024 ఎన్నికల్లో సాంబశివరావును ఇక్కడి నుంచి తప్పించి, చీరాలకు పంపించే అవకాశముందని టాక్. అంతే కాకుండా టీడీపీ-జనసేన- బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా హితేష్ ను పర్చూరులో పోటీ చేయించేలా పురందేశ్వరి మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇలా ఉమ్మడి అభ్యర్థిగా నిలబడితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె నమ్ముతున్నారని టాక్. 

This post was last modified on December 24, 2023 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

1 hour ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

2 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

3 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

3 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

4 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

4 hours ago