ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రెడీ చేసుకుని ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి పేరుతో ప్రాంతీయ, కలిసి వచ్చే జాతీయ పార్టీలను ఏకం చేసి.. పొలిటికల్ ఫైట్కు రెడీ అవుతోంది. అయితే.. కాంగ్రెస్ వ్యూహాన్ని తలదన్నే లా ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశంలో మోడీ 2024 లక్ష్యాన్ని ప్రకటించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నాయకులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతాన్ని గత ఎన్నికల్లో కంటే 10 శాతం పెంచేందుకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2019లో 303 సీట్లు గెలిచామని, ఇప్పటినుంచి మిషన్ మోడ్లో పనిచేస్తే ఈసారి మరిన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాలో దూకుడుగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని పార్టీ అధిష్ఠానానికి సూచించారు.
ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ, సానుకూల సమాధానాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా పెద్దసం ఖ్యలో మహిళలు, యువత, రైతులు, పేదలను చేరుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఓట్ల పెంపుతో పాటు అయోధ్య రామాలయం నిర్మాణం, ఇక్కడ కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను కూడా ప్రజలకు వివరించి.. హిందూ ఓటర్లను మరింత మచ్చిక చేసుకునేలా కార్యాచరణ రూపొందించుకోవాల న్నారు. కాగా, బీజేపీ దెబ్బకు ప్రతిపక్షాలు దిగ్భ్రాంతి చెందాలని పిలుపునివ్వడం గమనార్హం.
This post was last modified on December 24, 2023 3:03 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…