Political News

మోడీ టార్గెట్ పెద్దదే

ఒక‌వైపు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపాల‌నే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రెడీ చేసుకుని ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇండియా కూట‌మి పేరుతో ప్రాంతీయ‌, క‌లిసి వ‌చ్చే జాతీయ పార్టీల‌ను ఏకం చేసి.. పొలిటిక‌ల్ ఫైట్‌కు రెడీ అవుతోంది. అయితే.. కాంగ్రెస్ వ్యూహాన్ని త‌ల‌ద‌న్నే లా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌రికొత్త ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తాజాగా ఢిల్లీలో జ‌రిగిన బీజేపీ జాతీయ ప‌దాధికారుల స‌మావేశంలో మోడీ 2024 ల‌క్ష్యాన్ని ప్ర‌క‌టించారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నాయకులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతాన్ని గత ఎన్నికల్లో కంటే 10 శాతం పెంచేందుకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2019లో 303 సీట్లు గెలిచామని, ఇప్పటినుంచి మిషన్‌ మోడ్‌లో పనిచేస్తే ఈసారి మరిన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. సోషల్‌ మీడియాలో దూకుడుగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని పార్టీ అధిష్ఠానానికి సూచించారు.

ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ, సానుకూల సమాధానాలు ఇవ్వాలని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ద్వారా పెద్దసం ఖ్యలో మహిళలు, యువత, రైతులు, పేదలను చేరుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఓట్ల పెంపుతో పాటు అయోధ్య రామాలయం నిర్మాణం, ఇక్క‌డ క‌ల్పిస్తున్న వ‌స‌తులు, సౌక‌ర్యాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించి.. హిందూ ఓట‌ర్ల‌ను మ‌రింత మ‌చ్చిక చేసుకునేలా కార్యాచ‌ర‌ణ రూపొందించుకోవాల న్నారు. కాగా, బీజేపీ దెబ్బకు ప్రతిపక్షాలు దిగ్భ్రాంతి చెందాలని పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

లాక్కుపోతున్న మ‌లయాళం సినిమా

సినిమాల స‌క్సెస్ రేట్ ప‌డిపోతోందని.. ఒక‌ప్ప‌ట్లా జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌ట్లేద‌ని ఈ మ‌ధ్య మ‌న ఇండ‌స్ట్రీలో త‌ర‌చుగా ఆవేద‌న స్వ‌రం…

35 minutes ago

OG 2 అనుమానాలు తీరిపోయాయి

గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని,…

52 minutes ago

బండ్ల గణేశ్… నిజంగా పవన్ భక్తుడే

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…

1 hour ago

తెలంగాణలో ప‌వ‌న్‌… కిక్కిరిసిన అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లోని హ‌నుమకొండ‌లో ప‌ర్య‌టించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు…

2 hours ago

హన్మకొండలో పవన్… చోటా గబ్బర్ సింగ్ కు పరామర్శ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…

3 hours ago

సింగీతం మెచ్చిన పుష్ప

వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…

3 hours ago