Political News

మోడీ టార్గెట్ పెద్దదే

ఒక‌వైపు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపాల‌నే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రెడీ చేసుకుని ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇండియా కూట‌మి పేరుతో ప్రాంతీయ‌, క‌లిసి వ‌చ్చే జాతీయ పార్టీల‌ను ఏకం చేసి.. పొలిటిక‌ల్ ఫైట్‌కు రెడీ అవుతోంది. అయితే.. కాంగ్రెస్ వ్యూహాన్ని త‌ల‌ద‌న్నే లా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌రికొత్త ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తాజాగా ఢిల్లీలో జ‌రిగిన బీజేపీ జాతీయ ప‌దాధికారుల స‌మావేశంలో మోడీ 2024 ల‌క్ష్యాన్ని ప్ర‌క‌టించారు.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నాయకులకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతాన్ని గత ఎన్నికల్లో కంటే 10 శాతం పెంచేందుకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2019లో 303 సీట్లు గెలిచామని, ఇప్పటినుంచి మిషన్‌ మోడ్‌లో పనిచేస్తే ఈసారి మరిన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. సోషల్‌ మీడియాలో దూకుడుగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని పార్టీ అధిష్ఠానానికి సూచించారు.

ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ, సానుకూల సమాధానాలు ఇవ్వాలని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర ద్వారా పెద్దసం ఖ్యలో మహిళలు, యువత, రైతులు, పేదలను చేరుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఓట్ల పెంపుతో పాటు అయోధ్య రామాలయం నిర్మాణం, ఇక్క‌డ క‌ల్పిస్తున్న వ‌స‌తులు, సౌక‌ర్యాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించి.. హిందూ ఓట‌ర్ల‌ను మ‌రింత మ‌చ్చిక చేసుకునేలా కార్యాచ‌ర‌ణ రూపొందించుకోవాల న్నారు. కాగా, బీజేపీ దెబ్బకు ప్రతిపక్షాలు దిగ్భ్రాంతి చెందాలని పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 24, 2023 3:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

1 hour ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

1 hour ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

2 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

2 hours ago

వారణాసి సంగీతం మీద ఆర్ఆర్ఆర్ బరువు

ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…

4 hours ago

స్వయంభు సౌండ్ గట్టిగా వినిపించాల్సిందే

నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…

5 hours ago