ఏపీలో రాజకీయ పరిణామాలు వడివడిగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు .. వివిధ కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శించిన టీడీపీ.. హఠాత్తుగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను లైన్లోకి తీసుకుంది. ఆయనతో చంద్రబాబు నేరుగా నాలుగు గంటల పాటు చర్చలు కూడా జరిపారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో పీకేను పూర్తిస్థాయిలో వాడతారో లేదో తెలియదు కానీ.. ఇప్పటికైతే సంకేతాలు ఇచ్చారు.
అయితే.. పీకే రాక.. టీడీపీకి ఎలా ఉన్నా.. వచ్చే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై పీకే ప్రభావం తీవ్రంగా ఉంటుందని మాత్రం పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన పార్టీలు చేతులు కలిపాయి. కలిసి పోటీ చేయాలని కూడా నిర్ణయించాయి. అయితే .. ఈ బంధాన్ని బీజేపీతో మరింత ద్రుఢ పరుచుకోవాలన్నది ఈ రెండు పార్టీల వ్యూహం. అందుకే.. తరచుగా పవన్ కళ్యాణ్.. ఎక్కడ మాట్లాడినా బీజేపీ గురించి వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టు పవన్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు అనివార్యమని కూడా పవన్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, మరోవైపు టీడీపీ కూడా.. బీజేపీ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదే ఎదురు చూపులు లేకపోతే.. ఇప్పటికే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలతో ఈ రెండు పార్టీలు జతకట్టేవనే ప్రచారం కూడా ఉంది. కానీ, బీజేపీ కోసం వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు.
ఇదిలావుంటే.. తాజాగా జరిగిన పరిణామంతో బీజేపీ.. టీడీపీ-జనసేన కూటమితో జతకట్టే పరిస్థితి ఉండదని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ- పీకేను అక్కున చేర్చుకుని.. ఆయన వ్యూహాలతో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. బీజేపీకి, పీకేకి మధ్య ఒకప్పుడు ఉన్న సంబంధాలు ఇప్పుడు లేకపోగా.. అవకాశం వస్తే.. అరెస్టు చేయాలన్న వ్యూహంతో బీజేపీ పెద్దలు.. పీకే టైం కోసం ఎదురు చూస్తున్నారన్నది జాతీయ వర్గాలు చెబుతున్న మాట.
అడుగడుగునా మోడీని విమర్శించడం.. దేశాన్ని హిందూత్వ గా మారుస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించడం.. మోడీ ఓటమిని లక్షించి .. గతంలో కాంగ్రెస్కు పనిచేయడం.. బిహార్లో నితీష్ కుమార్ను గెలిపించడం వంటివి బీజేపీకి మంటపుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీకే చాయలు అంటేనే బీజేపీ పెద్దలు మండి పడుతున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీ పోయి పోయి పీకేతో చేతులు కలిపితే.. బీజేపీ రేపు ఈ కూటమికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on December 24, 2023 10:57 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…