Political News

పీకే వ్యూహానికి బీజేపీ దూరం.. పొత్తు లేన‌ట్టే…!

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు .. వివిధ కార్య‌క్ర‌మాల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శించిన టీడీపీ.. హ‌ఠాత్తుగా వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌ను లైన్‌లోకి తీసుకుంది. ఆయ‌న‌తో చంద్ర‌బాబు నేరుగా నాలుగు గంట‌ల పాటు చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పీకేను పూర్తిస్థాయిలో వాడ‌తారో లేదో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికైతే సంకేతాలు ఇచ్చారు.

అయితే.. పీకే రాక‌.. టీడీపీకి ఎలా ఉన్నా.. వ‌చ్చే పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తుల‌పై పీకే ప్ర‌భావం తీవ్రంగా ఉంటుంద‌ని మాత్రం ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ-జ‌న‌సేన పార్టీలు చేతులు క‌లిపాయి. క‌లిసి పోటీ చేయాల‌ని కూడా నిర్ణ‌యించాయి. అయితే .. ఈ బంధాన్ని బీజేపీతో మ‌రింత ద్రుఢ ప‌రుచుకోవాల‌న్నది ఈ రెండు పార్టీల వ్యూహం. అందుకే.. త‌ర‌చుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఎక్క‌డ మాట్లాడినా బీజేపీ గురించి వ్యాఖ్యానిస్తున్నారు.

బీజేపీ కూడా క‌లిసి వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్టు ప‌వ‌న్ చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ పొత్తు అనివార్య‌మ‌ని కూడా ప‌వ‌న్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక‌, మ‌రోవైపు టీడీపీ కూడా.. బీజేపీ కోసం ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే ఎదురు చూపులు లేక‌పోతే.. ఇప్ప‌టికే క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీల‌తో ఈ రెండు పార్టీలు జ‌త‌క‌ట్టేవ‌నే ప్ర‌చారం కూడా ఉంది. కానీ, బీజేపీ కోసం వెయిట్ చేస్తున్న నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ఇదిలావుంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిణామంతో బీజేపీ.. టీడీపీ-జ‌న‌సేన కూట‌మితో జ‌త‌క‌ట్టే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ- పీకేను అక్కున చేర్చుకుని.. ఆయ‌న వ్యూహాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. బీజేపీకి, పీకేకి మ‌ధ్య ఒక‌ప్పుడు ఉన్న సంబంధాలు ఇప్పుడు లేక‌పోగా.. అవ‌కాశం వ‌స్తే.. అరెస్టు చేయాల‌న్న వ్యూహంతో బీజేపీ పెద్ద‌లు.. పీకే టైం కోసం ఎదురు చూస్తున్నార‌న్న‌ది జాతీయ వ‌ర్గాలు చెబుతున్న మాట‌.

అడుగ‌డుగునా మోడీని విమ‌ర్శించ‌డం.. దేశాన్ని హిందూత్వ గా మారుస్తున్నార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డం.. మోడీ ఓట‌మిని ల‌క్షించి .. గ‌తంలో కాంగ్రెస్‌కు ప‌నిచేయ‌డం.. బిహార్‌లో నితీష్ కుమార్‌ను గెలిపించ‌డం వంటివి బీజేపీకి మంట‌పుట్టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పీకే చాయ‌లు అంటేనే బీజేపీ పెద్ద‌లు మండి ప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో టీడీపీ పోయి పోయి పీకేతో చేతులు క‌లిపితే.. బీజేపీ రేపు ఈ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

This post was last modified on December 24, 2023 10:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

55 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago