వచ్చే ఎన్నికల్లో పోటీ ఎలా ఉన్నా.. పది స్థానాలైనా పాతికైనా.. వందైనా.. అసలు పోటీలో ఉన్న నాయకులకు కీలక వనరు సొమ్ములే! ప్రజలకు పంచాల్సిన అవసరం లేకపోయినా.. పంచకపోయినా.. కనీసం నాయకులకు చేతి ఖర్చు.. ప్రచార ఖర్చు.. వంటివి కీలకం కదా! ఇవేవీ ఉచితంగా ఎవరూ చేయరు. సో.. ఆ ఖర్చులకైనా నాయకులకు డబ్బులు కావాలంటే.. ఇబ్బందులు తప్పేలా లేవనేది జనసేనలో వినిపిస్తున్న మాట.
“వచ్చే ఎన్నికలు భారీ ఖర్చుతో కూడుకున్నవనే టాక్ ఉంది. తెలంగాణ ఎన్నికలు చూశాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 50 లక్షలపైనే ఖర్చయింది. మా పరిస్థితి చూస్తే.. ఇబ్బంది తప్పేలా లేదు” అని జనసేనలో నాయకులు చర్చించుకుంటున్నారు. దీనికి కారణం.. చెప్పే ముందు.. మరో కీలక విషయం ఉంది. సాధారణంగా గెలిచే నాయకుడు ఎవరనేది అంచనాకు వస్తే.. సదరు నియోజకవర్గంలోని పారిశ్రామిక వేత్తలు.. లేదా వ్యాపారులు అడగకుండానే పని చేసి పెడతారు.
ఇది తెలంగాణలో బాగానే వర్కవుట్ అయింది. దీంతో అసలు గెలుపుపై అంచనాలు లేని వారు కూడా విజయం సాధించారు. ఈ తరహా పరిస్థితిఇప్పుడు ఏపీలో జనసేనకు కనిపిస్తుందా? అనేది ప్రశ్న. దీనిపైనే జనసేన నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. అసలు గెలుస్తారా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. గెలుస్తున్నామనే ధీమాను పారిశ్రామిక, వ్యాపార వర్గాల్లో అయిన కల్పించగలిగితే చేతులు తడుస్తాయనేది వారి మాట. కానీ, ప్రస్తుతం జనసేనలోనే పెద్ద కలకలం రేగింది.
పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని ఎవరూ తప్పుబట్టకపోయినా.. తర్వాత పరిణామాలపైనే అందరూ దృష్టి పెట్టారు. దీంతో పారిశ్రామిక, వ్యాపార వర్గాలు.. ఈ పార్టీని ఎంత వరకు ఆదరిస్తాయనేది ప్రశ్నగామారింది. మరోవైపు.. పార్టీలోనూ భారీగా ఫండ్స్ లేవు. ఇండస్ట్రీలో పవన్ అంటే అభిమానించే వారు కూడా.. పార్టీకి ఫండ్స్ ఇచ్చేందుకు వెనుకాడుతున్నారు. దీంతో అభ్యర్థులు తమ సొంత నిధులనే వెచ్చించాల్సి ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. తెలంగాణను మించి ఖర్చు అవుతుందనే అంచనాలు వున్న ఏపీ ఎన్నికల్లో అంత ఖర్చు భరించే నాయకులు ఉన్నారా? అనేది జనసేన టాక్. చూడాలి ఏం చేస్తారో.
This post was last modified on December 24, 2023 9:46 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…