మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగనున్న ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఎలా ఉంది? జనం నాడి ఏ పార్టీకి అనుకూలంగా ఉంది? ఏ పార్టీ విషయంలో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు? వెరసి మొత్తంగా ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. ఇవే విషయాలపై తాజాగా ప్రముఖ సర్వే సంస్థ చాణక్య స్ట్రాటజీస్ సర్వే
రాష్ట్రంలో పర్యటించి వివరాలు సేకరించింది. దీని ప్రకారం.. అధికార వైసీపీ. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన సహా ఇతర పార్టీల పరిస్థితిని అంచనా వేసింది. ఈ సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది.
‘చాణక్య స్ట్రాటజీస్ సర్వే’ ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో(2019-23) టీడీపీ గ్రాఫ్ పుంజుకుందని తెలుస్తోంది. అదేసమయంలో అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ పడిపోయినట్టు అర్థమవుతోంది. ఇక, జనసేన సహా ఇతర పార్టీల గ్రాఫ్ కూడా కొంత మేరకు పెరిగినట్టు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం ఉన్న గ్రాఫ్లు.. ఎన్నికల సమయానికి మరింత పెరగడమో.. తగ్గడమో జరుగుతుందని సర్వే సంస్థ వెల్లడించింది. ఇవీ వివరాలు..
టీడీపీ: 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీ గ్రాఫ్ 39 శాతం ఉండగా.. ప్రస్తుతం 43 శాతానికి పెరిగింది.
వైసీపీ: 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీ గ్రాఫ్ 50 శాతం ఉండగా ప్రస్తుతం 41 శాతానికి(ఏకంగా 9శాతం) పడిపోయింది.
జనసేన: 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీ గ్రాఫ్ 6 శాతం ఉండగా ప్రస్తుతం 10 శాతానికి(ఏకంగా 4శాతం) పెరిగింది.
ఇతర పార్టీలు: 2019 ఎన్నికల తర్వాత ఈ పార్టీల గ్రాఫ్ 5 శాతం ఉండగా ప్రస్తుతం 6 శాతానికి చేరింది.
This post was last modified on December 23, 2023 10:28 pm
ఏపీ అసెంబ్లీలో ఓ వింత పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీకి సభలో ప్రధాన…
కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు స్టార్లు లేకపోయినా బ్రహ్మాండంగా ఆదరిస్తారని గతంలో బలగం లాంటివి ఋజువు చేస్తే తాజాగా కోర్ట్…
మే 9 విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు కన్నా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి మీదే ఎక్కువ ప్రేముందనేది బహిరంగ…
విడుదలై నెలరోజులు దాటుతున్నా ఛావా పరుగులు ఆగడం లేదు. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వారాంతం వస్తే చాలు విక్కీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే.. అది క్షణాల్లో అమలు కావాల్సిందే. ఇదేదో……
ఓ వైపేమో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే… విపక్షాలు సైతం తమ కార్యక్రమాలను ఘనంగా…