తాజాగా విడుదలైన ప్రభాస్ మూవీ సలార్ తొలి రోజు హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత..అనేక పరాజయాలు చవి చూసిన ప్రభాస్కు ఒకింత ఈ సినిమా రిలీఫ్ ఇచ్చింది. ఈ సినిమాలో డైలాగులు కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఇక, ఈ సినిమాను రాజకీయ నాయకులు కూడా వీక్షించారు. అయితే.. వీక్షించి సరిపెడితే ఏముంటుందని అనుకున్నారో..ఏమో టీడీపీ కురువృద్ధుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.. సలార్కు సీఎం జగన్కు ముడి పెట్టి పొలిటికల్ సటైర్లు కుమ్మేశారు.
వయసులో పెద్దే అయినా.. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పొలిటికల్గాను, ఇతర విషయాల్లోనూ చాలా చురుగ్గా ఉంటారనే పేరుంది. మరీ ముఖ్యంగా ఇటవల కాలంలో సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్గా ఉంటున్నారు. మాటకు మాట.. అన్నట్టుగా కామెంట్లు కూడా కుమ్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బుచ్చయ్య చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. వైసీపీ అధినేత, సీఎం జగన్పై బుచ్చయ్య చౌదరి ఓ ట్వీట్ చేశారు. అదికూడా శుక్రవారం విడుదలైన ప్రభాస్ సలార్ మూవీని లింకు పెట్టడంతో దీనికి మరింత ఇంట్రస్ట్ పెరిగింది.
“ప్రభాస్ను కరెక్టుగా వాడుకుంది దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ మాత్రమే. జూనియర్ ఎన్టీఆర్ను కరెక్టుగా వాడుకుంది డైరెక్టర్ రాజమౌళి, వినాయక్ మాత్రమే. మహేష్బాబును కరెక్టుగా వాడుకుంది పూరీ జగన్నాథ్ మాత్రమే. అల్లు అర్జున్ను కరెక్టుగా వాడుకుంది సుకుమార్ మాత్రమే. అలాగే బాబాయ్, చెల్లి, తల్లిని కరెక్టుగా వాడుకుంది జగన్ మాత్రమే” అని బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
This post was last modified on December 23, 2023 10:11 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…