ఇటీవల మినీ మహానాడులో టీడీపీ కొన్ని పథకాలు ప్రకటించింది. వీటిలో ఒకటి.. మహిళలకు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడకైనా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహిళలకు ఈ అవకాశం కల్పిస్తామని టీడీపీ తెలిపింది. అయితే.. ఏమనుకున్నారో.. ఏమో వైసీపీ ప్రభుత్వం ఇదే పథకాన్ని చెప్పాపెట్టకుండానే అమలు చేసేందుకు రెడీ అయిపోయింది.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆఘమేఘాలపై అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఆర్టీసీ అధికారులతో సీఎంవో, జీఏడీ అధికారులు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. జనవరిలో.. వీలైతే సంక్రాంతి పండుగ నుంచి దీనిని అమలులోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంపై అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ నిబంధనలతో ఏ టైపు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు? ఉచితం అమలు చేస్తే ఆర్టీసీ రాబడిలో ఎంత తగ్గుతుంది? దానికి ప్రభుత్వం ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందన్న అంశాలపై చర్చిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…