ఇటీవల మినీ మహానాడులో టీడీపీ కొన్ని పథకాలు ప్రకటించింది. వీటిలో ఒకటి.. మహిళలకు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడకైనా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహిళలకు ఈ అవకాశం కల్పిస్తామని టీడీపీ తెలిపింది. అయితే.. ఏమనుకున్నారో.. ఏమో వైసీపీ ప్రభుత్వం ఇదే పథకాన్ని చెప్పాపెట్టకుండానే అమలు చేసేందుకు రెడీ అయిపోయింది.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆఘమేఘాలపై అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఆర్టీసీ అధికారులతో సీఎంవో, జీఏడీ అధికారులు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. జనవరిలో.. వీలైతే సంక్రాంతి పండుగ నుంచి దీనిని అమలులోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంపై అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ నిబంధనలతో ఏ టైపు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు? ఉచితం అమలు చేస్తే ఆర్టీసీ రాబడిలో ఎంత తగ్గుతుంది? దానికి ప్రభుత్వం ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందన్న అంశాలపై చర్చిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా.
This post was last modified on December 23, 2023 2:55 pm
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…