Political News

టీడీపీ హామీ… వైసీపీ అమ‌లు చేస్తోంది

ఇటీవ‌ల మినీ మ‌హానాడులో టీడీపీ కొన్ని పథకాలు ప్రకటించింది. వీటిలో ఒక‌టి.. మ‌హిళ‌ల‌కు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్క‌డకైనా.. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మ‌హిళ‌ల‌కు ఈ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని టీడీపీ తెలిపింది. అయితే.. ఏమ‌నుకున్నారో.. ఏమో వైసీపీ ప్ర‌భుత్వం ఇదే ప‌థ‌కాన్ని చెప్పాపెట్ట‌కుండానే అమ‌లు చేసేందుకు రెడీ అయిపోయింది.

మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు సౌక‌ర్యాన్ని ఆఘమేఘాలపై అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై నివేదిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన‌ట్టు తెలిసింది. దీంతో ఆర్టీసీ అధికారులతో సీఎంవో, జీఏడీ అధికారులు రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. జనవరిలో.. వీలైతే సంక్రాంతి పండుగ నుంచి దీనిని అమలులోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నట్లు ఆర్టీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంపై అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఏ నిబంధనలతో ఏ టైపు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు? ఉచితం అమలు చేస్తే ఆర్టీసీ రాబడిలో ఎంత తగ్గుతుంది? దానికి ప్రభుత్వం ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందన్న అంశాలపై చర్చిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 15 లక్షల మంది వరకు మహిళలు ఉంటారని అంచనా.

This post was last modified on December 23, 2023 2:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జననాగయన్ లీక్ వెనుక..

ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…

1 hour ago

గాడ్ ఆఫ్ వార్… ఏదో ఒకటి తేలిపోవాలి

గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…

1 hour ago

మృణాల్‌తో సినిమా చేస్తే హీరో ఔటేనా?

సినిమాల్లో పాత్రలను కొంతమంది నిజ జీవితంలో కూడా ఎంతో ఓన్ చేసుకుంటారు. తెరపై వారికి అన్యాయం జరిగితే నిజంగానే వారికేదో నష్టం…

3 hours ago

ఒక్కొక్క పార్టీకీ `3 గంట‌లు`…

పార్ల‌మెంటులో డీలిమిటేష‌న్ స‌హా.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై చ‌ర్చించేందుకు.. ఎంత‌స‌మ‌య‌మైనా ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రెడీ అయింది. ఈ వ్య‌వ‌హారంపై…

4 hours ago

జగన్ మకాం మార్పు.. సెంటిమెంటా? రాజకీయ వ్యూహమా?

అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…

5 hours ago

తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజ‌మే..

వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…

5 hours ago