Political News

రేవంత్ కొత్త నిర్ణయం

ప్రజావాణిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. ప్రజల సమస్యలు విని వీలైనంత తొందరగా తీర్చే ఉద్దేశ్యంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రేవంత్ ను కలిసి సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారమవుతాయని రాష్ట్రంలోని చాలామంది జనాలు ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రజాదర్బార్(ప్రజావాణి)లో రోజుకు 4 వేలమంది బాధితులు వస్తున్నట్లు లెక్క తేలింది.

అందుకనే ఇక నుండి అంటే కొత్త సంవత్సరం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని హైదరాబాద్ లోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలోను జరపాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ప్రతి ఎంఎల్ఏ వారంలో ఒకరోజు ప్రత్యేకించి ప్రజావాణి కార్యక్రమంలోనే ఉండి బాధితులతో మాట్లాడాలని రేవంత్ ఆదేశించారు. ప్రజావాణి లాంటి కార్యక్రమాలతోనే ప్రజలకు ప్రభుత్వం దగ్గరవుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ప్రజలిచ్చే సమస్యలను పరిశీలించి పరిష్కారం చూపేందుకు, ఫాలో అప్ చేసేందుకు ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలోను ఒక నోడల్ అధికారిని నియమించే ఆలోచనలో ఉన్నారు రేవంత్.

ప్రతి నియోజకవర్గంలోను ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే జనాలంతా వినతులు తీసుకుని హైదరాబాద్ కు వచ్చే బాధలు తప్పుతాయని రేవంత్ భావించారు. అందుకనే నియోజకవర్గాల స్ధాయిలో కూడా ప్రజావాణినిని మొదలుపెడుతున్నది. ఇపుడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే గ్రీవెన్స్ కు ప్రజావాణి కార్యక్రమం అదనంగా పనిచేస్తుంది. పదేళ్ళ పాలనలో కేసీయార్ ఏనాడు ఈ విధంగా బాధితులను కలిసిందిలేదు. అసలు సచివాలయంకు కేసీయార్ రావటమే చాలా ఎక్కువన్నట్లుగా ఉండేది.

వారాల తరబడి ఫాం హౌస్లో కూర్చునే వారు. మంత్రులు, ఉన్నతాధికారులు కలవాలని అనుకున్నా కేసీయార్ కలిసే వారు కాదు. అలాంటిది ఇపుడు రేవంత్ ప్రతిరోజు జనాలను కలుస్తు, ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో సమీక్షలు నిర్వహిస్తుంటే అందరు హ్యాపీగా ఫీలవుతున్నారు. కేసీయార్ పదేళ్ళ పాలనతో ఇపుడు రేవంత్ పాలనను పోల్చి చూసుకోవటం ఎక్కువైపోతోంది. అందుకనే ప్రజావాణిలోనే కాకుండా రేవంత్ ను కలవటానికి జనాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు సచివాలయంకు రావటం ఎక్కువైపోతోంది. మరిలా ఎంతకాలం రేవంత్ జనాలను కలుస్తారో చూడాలి.

This post was last modified on December 23, 2023 11:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago