Political News

రేవంత్ కొత్త నిర్ణయం

ప్రజావాణిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. ప్రజల సమస్యలు విని వీలైనంత తొందరగా తీర్చే ఉద్దేశ్యంలో ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రేవంత్ ను కలిసి సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారమవుతాయని రాష్ట్రంలోని చాలామంది జనాలు ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు వస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రజాదర్బార్(ప్రజావాణి)లో రోజుకు 4 వేలమంది బాధితులు వస్తున్నట్లు లెక్క తేలింది.

అందుకనే ఇక నుండి అంటే కొత్త సంవత్సరం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని హైదరాబాద్ లోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలోను జరపాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ప్రతి ఎంఎల్ఏ వారంలో ఒకరోజు ప్రత్యేకించి ప్రజావాణి కార్యక్రమంలోనే ఉండి బాధితులతో మాట్లాడాలని రేవంత్ ఆదేశించారు. ప్రజావాణి లాంటి కార్యక్రమాలతోనే ప్రజలకు ప్రభుత్వం దగ్గరవుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ప్రజలిచ్చే సమస్యలను పరిశీలించి పరిష్కారం చూపేందుకు, ఫాలో అప్ చేసేందుకు ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలోను ఒక నోడల్ అధికారిని నియమించే ఆలోచనలో ఉన్నారు రేవంత్.

ప్రతి నియోజకవర్గంలోను ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తే జనాలంతా వినతులు తీసుకుని హైదరాబాద్ కు వచ్చే బాధలు తప్పుతాయని రేవంత్ భావించారు. అందుకనే నియోజకవర్గాల స్ధాయిలో కూడా ప్రజావాణినిని మొదలుపెడుతున్నది. ఇపుడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగే గ్రీవెన్స్ కు ప్రజావాణి కార్యక్రమం అదనంగా పనిచేస్తుంది. పదేళ్ళ పాలనలో కేసీయార్ ఏనాడు ఈ విధంగా బాధితులను కలిసిందిలేదు. అసలు సచివాలయంకు కేసీయార్ రావటమే చాలా ఎక్కువన్నట్లుగా ఉండేది.

వారాల తరబడి ఫాం హౌస్లో కూర్చునే వారు. మంత్రులు, ఉన్నతాధికారులు కలవాలని అనుకున్నా కేసీయార్ కలిసే వారు కాదు. అలాంటిది ఇపుడు రేవంత్ ప్రతిరోజు జనాలను కలుస్తు, ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో సమీక్షలు నిర్వహిస్తుంటే అందరు హ్యాపీగా ఫీలవుతున్నారు. కేసీయార్ పదేళ్ళ పాలనతో ఇపుడు రేవంత్ పాలనను పోల్చి చూసుకోవటం ఎక్కువైపోతోంది. అందుకనే ప్రజావాణిలోనే కాకుండా రేవంత్ ను కలవటానికి జనాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు సచివాలయంకు రావటం ఎక్కువైపోతోంది. మరిలా ఎంతకాలం రేవంత్ జనాలను కలుస్తారో చూడాలి.

This post was last modified on December 23, 2023 11:21 am

Share

Recent Posts

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు

రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…

42 minutes ago

అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో…

45 minutes ago

ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…

1 hour ago

అమరావతికి మహర్దశ… బాబు ప్రయత్నం ఫలిస్తుంది!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క ప్రాధ‌మిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిల‌ను సీఎం చంద్ర‌బాబు తాజాగా…

1 hour ago

ఫ్లాప్ సినిమా సీక్వెల్… అయినా క్రేజ్ ఉంది

ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…

2 hours ago

నాగవంశీకి ఈసారి అలాంటి ఇబ్బంది లేదు

కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…

2 hours ago