అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు తాజాగా దాఖలు చేసిన పిటిషన్ సంచలనం రేపుతోంది. లోకేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో లోకేష్ పై చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులు కోరారు.
ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీసు నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని సీఐడీ అధికారులు ఆరోపించారు. అంతేకాదు, రెడ్ బుక్ లో అధికారుల పేర్లు రాసుకున్నానని లోకేష్ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు సంచలన ఆరోపణలు చేశారు. అయితే, అందుకు సాక్ష్యాలు చూపించాలని సీఐడీ అధికారులను జడ్జి ప్రశ్నించారు. దీంతో, ఆయా పత్రికల రెడ్ బుక్ కు సంబంధించిన క్లిప్పింగ్లను సీబీఐ తరపు న్యాయవాది చూపించారు. లోకేష్ ను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది.
కాగా, లోకేష్ పై ఏపీ సీఐడీ అధికారులు గతంలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు వ్యవహారంలో లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, లోకేష్ కు 41ఏ నోటీసులిచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే లోకేష్ కు ఆల్రెడీ 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. సీఐడీ అధికారులు ఆయన విచారణకు రావాలని ఆదేశించగా…లోకేష్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
This post was last modified on December 22, 2023 9:34 pm
హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…
త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…
పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…