అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు తాజాగా దాఖలు చేసిన పిటిషన్ సంచలనం రేపుతోంది. లోకేష్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలంటూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో లోకేష్ పై చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులు కోరారు.
ఐఆర్ఆర్ కేసులో 41ఏ నోటీసు నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని సీఐడీ అధికారులు ఆరోపించారు. అంతేకాదు, రెడ్ బుక్ లో అధికారుల పేర్లు రాసుకున్నానని లోకేష్ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు సంచలన ఆరోపణలు చేశారు. అయితే, అందుకు సాక్ష్యాలు చూపించాలని సీఐడీ అధికారులను జడ్జి ప్రశ్నించారు. దీంతో, ఆయా పత్రికల రెడ్ బుక్ కు సంబంధించిన క్లిప్పింగ్లను సీబీఐ తరపు న్యాయవాది చూపించారు. లోకేష్ ను అరెస్టు చేసేందుకు అనుమతివ్వాలని, రెడ్ బుక్ పేరుతో అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని పిటిషన్లో పేర్కొంది.
కాగా, లోకేష్ పై ఏపీ సీఐడీ అధికారులు గతంలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు వ్యవహారంలో లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, లోకేష్ కు 41ఏ నోటీసులిచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే లోకేష్ కు ఆల్రెడీ 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. సీఐడీ అధికారులు ఆయన విచారణకు రావాలని ఆదేశించగా…లోకేష్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
This post was last modified on December 22, 2023 9:34 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…