Political News

ప‌వ‌న్‌తో డైరెక్టుగా మాట్లాడొచ్చుగా జోగ‌య్య గారు…!

కాపు సంక్షేమ సేన పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని.. కాపుల అభ్యున్న‌తి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని ప్ర‌క‌టిస్తున్న మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగయ్య‌.. తాజాగా సంధించిన లేఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీ క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. ముఖ్య‌మంత్రి సీటు విష‌యం చ‌ర్చ‌నీయాంశం అయింది. అయితే, త‌న‌కు ప‌దవుల‌పై కాంక్ష లేద‌ని.. జ‌న‌సేనాని ప‌దే ప‌దే చెబుతున్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌ను కార్న‌ర్ చేస్తూ.. తాజాగా జోగ‌య్య ప‌వ‌న్‌కు బ‌హిరంగ లేఖ రాశారు. కాపుల‌కు ఏం స‌మాధానం చెబుతార‌ని, మీపైనే ఆశ‌లు పెట్టుకుని, క‌ల‌లు క‌న్న వారికి ఎలాంటి స‌మాధానం చెబుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది ఒక ర‌కంగా.. జ‌న‌సేనాని గాలి తీసేసే ప్ర‌య‌త్న‌మేన‌న్నది రాజ‌కీయ వ‌ర్గాల టాక్‌. ఆయ‌న‌కు ఏదైనా చెప్పాల‌ని ఉంటే.. నేరుగా ప‌వ‌న్‌తోనే చ‌ర్చించి ఇది త‌ప్పు.. లేదా ఇది ఒప్పు అని చెప్పుకొనే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

అలా కాకుండా.. బ‌హిరంగ వేదిక‌ల‌పై జ‌న‌సేన ను ఇర‌కాటంలో పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. కాపుల‌ప‌క్షాన ఉంటున్నామ‌ని, కాపుల కోసం నిల‌బ‌డుతున్నా మ‌ని చెప్పే జోగ‌య్య‌.. ప‌వ‌న్‌ను ఇలా యాగీ చేయ‌డం.. ఆయ‌నను కార్న‌ర్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఏదైనా ఉంటే.. సరైన వేదిక ద్వారా అభిప్రాయం వెల్ల‌డించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఇక‌, ప‌వ‌న్ వ్య‌వ‌హారం చూసినా.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉన్నార‌ని చెబుతున్నారు.

కాపుల‌కు మేలు చేయాలంటే.. కేవ‌లం ముఖ్య‌మంత్రి పీఠమే ప‌ర‌మావ‌ధి కాద‌న్న విష‌యాన్ని ప‌వ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నా.. జోగ‌య్య వంటివారికి అర్ధం కావ‌డం లేదా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదైనా చెప్పాల‌ని ఉంటే.. నేరుగా ప‌వ‌న్‌ను క‌లిసి.. ఆయ‌న‌తోనే అభిప్రాయం పంచుకుంటే బాగుంటుంద‌ని అంటున్నారు. ఇలా బ‌హిరంగ లేఖ‌ల ద్వారా వ్యాఖ్య‌లు చేసి.. అన‌వ‌స‌రంగా పార్టీని ఇరుకున పెట్ట‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Satya

Recent Posts

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

13 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago