అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న మొండి పట్టుదలతో వైసీపీ.. అధికారంలోకి రాకపోతే భవిష్యత్ ఉండదనే భయంతో టీడీపీ.. వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి ఎన్నికల్లో గెలిచేందుకు ఏమైనా చేస్తుందన్న సంగతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు. వైసీపీ వరుసగా రెండో సారి ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు వేల కోట్ల రూపాయాలు ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడదు. ఈ విషయం తెలిసే బాబు కూడా ముందే జాగ్రత్త పడుతున్నారు. వైసీపీని ఓడించాలంటే రూ.వేల కోట్లు పెట్టాల్సిందేనని పార్టీ నాయకులను ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నారని టాక్.
వైసీపీ దుష్ట పాలన సాగిస్తుందని, జగన్ ను ఇంటికి పంపించాలని టీడీపీ తీవ్రమైన విమర్శలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇక వైసీపీపై ప్రజల్లో ఏర్పడుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంపై బాబు ఫోకస్ పెట్టారు. అయితే కేవలం ఈ వ్యతిరేకత మాత్రమే సరిపోదని అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించాలంటే ఆర్థిక బలం కూడా ఉండాలని బాబు అనుకుంటున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ప్రజా బలం కంటే కూడా డబ్బు బలమే కీలకంగా మారిన సంగతి తెలిసిందే.
వచ్చే ఎన్నికల్లో అధికారం కాపాడుకోవడం కోసం వైసీపీ ఒక్కో నియోజకవర్గంలో కనీసం రూ.50 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైందని టాక్. ఈ విషయం తెలుసుకున్న బాబు ఇప్పుడు తమ పార్టీ తరపున డబ్బున్న బడా బాబులను బరిలో దించాలని చూస్తున్నారని తెలిసింది. టికెట్ ఆశిస్తున్న నాయకులతో మాట్లాడుతున్న బాబు.. భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ముందే చెబుతున్నారంటా. అలాగే అభ్యర్థులు ఆర్థిక పరిస్థితిపై అంచనాకు వచ్చిన తర్వాతే టికెట్ ఖాయం చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పని చేయడం, కొన్నేళ్లుగా పార్టీలోనే ఉండటం విషయాలన్ని తర్వాత ముందు డబ్బు ఉందా? లేదా? అనేదే బాబు చూస్తున్నారని టాక్.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…