Political News

ఏపీపై ఈసీ అలర్ట్ .. నేటి నుంచి ప‌ర్య‌ట‌న‌!

వ‌చ్చే 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మాయ‌త్త‌మైంది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అధికారులు, ఇత‌ర అంశాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌నుంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం నుంచి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌రిశీల‌కులు.. రాష్ట్రానికి రానున్నారు. జిల్లాల వారిగా ప‌ర్య‌టించ‌నున్నారు. స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నే అంశాల‌పైనా దృష్టి పెట్ట‌నున్నారు.

మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్ల‌మెంటు స్థానాల్లో దాదాపు స‌గం నియోజ‌క‌వ‌ర్గాల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం డేగ‌క‌న్ను సారించ‌నుంద‌ని ఏపీ అధికారులు తెలిపారు. ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓట‌ర్ల జాబితా ల్లో చోటు చేసుకున్న అవ‌క‌త‌వ‌క‌లు స‌హా.. ఓట‌ర్ల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులు, విప‌క్ష పార్టీలు చేస్తున్న విమ‌ర్శ‌లు.. అందించిన కంప్లెయింట్స్‌.. ఇలా అన్ని విష‌యాల‌ను కూడా ప‌రిశీల‌న‌లోకి తీసుకోనుంది. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు కీల‌కమైన అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డంపైనా నిషేధం విధించే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే కొంద‌రు అధికారుల‌పై విప‌క్షాలు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదులు చేశాయి.ఈ క్ర‌మంలో ఆయా అధికారులు ప్రొఫైళ్ల‌ను కూడా ఎన్నిక‌ల సంఘం ప‌రిశీల‌న‌లోకి తీసుకుంది. ప్ర‌స్తుత ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయా అంశాల‌పైనా చ‌ర్చించి.. అవ‌స‌ర‌మైతే.. ప్ర‌మోష‌న్ల‌ను(ఇటీవ‌ల సీఐల‌కు డీఎస్పీలుగా ప్ర‌మోష‌న్ ఇచ్చారు) కూడా వెన‌క్కి తీసుకునేలా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌, స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో .. పోలింగ్ కేంద్రాల నిర్వ‌హ‌ణ స‌హా.. క‌లెక్ట‌ర్ల ప‌నితీరు.. వంటివి గ‌త ఆరు మాసాల జాబితాను కేంద్ర ఎన్నిక‌ల సంఘం సేక‌రించ‌నుంది. అదేవిధంగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, డీజీపీల‌తోనూ ప్ర‌త్యేకంగా భేటీ అయి చ‌ర్చించ‌నున్నారు. ఈ ప‌రిణామాలతో రాష్ట్రంలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం మ‌రింత కాక పుట్టించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీకి అనుకూలంగా ప‌నిచేస్తున్నార‌న్న విప‌క్షాల విమ‌ర్శ‌లు, ఫిర్యాదుల నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకునే చ‌ర్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

This post was last modified on December 22, 2023 12:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

2 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

4 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

8 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

9 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

9 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 hours ago