త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు ఏపీ సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారమే సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలుతోందని అధికారులు హడావిడి చేస్తున్నారు. జగన్ కూడా త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగిస్తానని పలుమార్లు హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ స్పీడ్ కు హైకోర్టు బ్రేకులు వేసింది. విశాఖకు కార్యాలయాల తరలింపు కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ హైకోర్టు తాజాగా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై జారీ అయిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. అయితే, అమరావతిలో కార్యాలయాల కన్నా భారీ స్థాయిలో విశాఖలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని, కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకువెళ్లారు. అందుకే, ఈ తరలింపుపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు.
గతంలో ఆర్ 5 జోన్ భూముల విషయంలో కూడా సీఎం కార్యక్రమం పేరుతో ఒక రోజుకు 3 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ అప్పటివరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. కాగా, సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన వెంటనే అమరావతి రాజధానిపై శీతకన్ను వేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు రాజధానులు అంటూ విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ ప్రకటించారు. విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు జగన్ సర్కార్ అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టింది. అయితే, నిర్మాణాలలో జాప్యం కారణంగా విశాఖకు రాజధాని తరలింపులో జాప్యం జరుగుతూ వస్తోంది.
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…