Political News

విశాఖకు రాజధాని తరలింపునకు హైకోర్టు బ్రేక్

త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు ఏపీ సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకారమే సీఎం క్యాంపు కార్యాలయం విశాఖకు తరలుతోందని అధికారులు హడావిడి చేస్తున్నారు. జగన్ కూడా త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగిస్తానని పలుమార్లు హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ స్పీడ్ కు హైకోర్టు బ్రేకులు వేసింది. విశాఖకు కార్యాలయాల తరలింపు కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ హైకోర్టు తాజాగా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చే వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై జారీ అయిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. అయితే, అమరావతిలో కార్యాలయాల కన్నా భారీ స్థాయిలో విశాఖలో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని, కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకువెళ్లారు. అందుకే, ఈ తరలింపుపై స్టే ఇవ్వాలని హైకోర్టును కోరారు.

గతంలో ఆర్ 5 జోన్ భూముల విషయంలో కూడా సీఎం కార్యక్రమం పేరుతో ఒక రోజుకు 3 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ అప్పటివరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది. కాగా, సీఎం జగన్ పగ్గాలు చేపట్టిన వెంటనే అమరావతి రాజధానిపై శీతకన్ను వేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు రాజధానులు అంటూ విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ ప్రకటించారు. విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు జగన్ సర్కార్ అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టింది. అయితే, నిర్మాణాలలో జాప్యం కారణంగా విశాఖకు రాజధాని తరలింపులో జాప్యం జరుగుతూ వస్తోంది.

This post was last modified on December 22, 2023 6:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

19 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

58 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago