Political News

మెంటల్ గా ప్రిపేర్ అయిపోయిన రోజా

రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కేది అనుమానమే అన్న విషయాన్ని మంత్రి రోజా మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినట్లున్నారు. అందుకనే మీడియాతో మాట్లాడుతు నగరిలో టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకేనే వాళ్ళ గెలుపుకు పనిచేస్తానని ప్రకటించారు. టికెట్ అయితే తనకే వస్తుందని తనకు కాకుండా ఎవరికిచ్చినా అభ్యంతరంలేదన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో మాటలకు ఇప్పటి మాటలకు చాలా తేడావచ్చేసింది. నగరిలో తాను తప్ప ఇంకెవరు పోటీచేయరని గతంలో చెప్పేవారు.

అయితే టికెట్ల ఖరారులో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మార్పులను రోజా గమనించినట్లున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను మారుస్తున్న వైనాన్ని చూస్తున్నారు. అందుకనే తనకు కూడా మార్పు తప్పదు అన్న విషయాన్ని రోజా మానసికంగా సిద్ధపడినట్లున్నారు. అందుకనే నగరిలో టికెట్ ఎవరికిచ్చినా గెలుపుకు కష్టపడతానని చెప్పింది. నిజానికి రోజా నోరే తనకు తీరని కష్టాలను తెచ్చిపెడుతోంది. పైగా మొదటినుండి దూకుడు స్వభావం చాలా ఎక్కువ.

అందుకనే ప్రత్యర్ధిపార్టీలే కాదు పార్టీలోని తన ప్రత్యర్ధుల విషయంలో కూడా మంచి దూకుడుగానే ఉంటున్నారు. దాంతో రోజా వ్యవహారం నచ్చని కొందరు సీనియర్ నేతలు ఏకమయ్యారు. తన వ్యతిరేకులతో మాట్లాడుకుని సర్దుబాటు చేసుకోవాల్సిన మంత్రి వ్యతిరేకుల విషయంలో మరింత దూకుడుపెంచారు. దాంతో ప్రతి విషయంలోను రోజాను  వ్యతిరేకించే బలమైన ప్రత్యర్ధివర్గం తయారైంది. ఒకవిధంగా ప్రత్యర్ధివర్గాన్ని రోజానే తయారుచేసుకున్నారు. ఎలాగంటే ప్రత్యర్ధివర్గంలో కీలకమైన శాంతి, కుమార్ దంపతులు, జడ్పీటీసీ మురళీధర్ రెడ్డి మొదట్లో రోజాకు బాగా సన్నిహితులే.

తనకు సన్నిహితులను కూడా రోజా కష్టపడి ప్రత్యర్ధులుగా మార్చుకున్నారు. దాంతో వీళ్ళంతా కలిసి శ్రీశైలం ట్రస్టుబోర్డు ఛైర్మన్  రెడ్డివారి చక్రపాణిరెడ్డితో చేతులు కలిపారు. దాంతో నియోజకవర్గంలో కీలకమైన సుమారు ఆరుగురు నేతలు రోజాకు బద్ధ వ్యతిరేకంగా జట్టుకట్టారు. రాబోయే ఎన్నికల్లో తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వాళ్ళంతా కలిసి గెలిపించుకుని వస్తామని జగన్ కే డైరెక్టుగా చెప్పారు. ఇదే సమయంలో రోజాకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని కూడా చెప్పారు. దాంతో రోజాకు టికెట్ సందిగ్దంలో పడిపోయింది. అందుకనే రోజా కూడా టికెట్ రాకపోయినా పర్వాలేదని మాట్లాడుతున్నారు.

This post was last modified on December 20, 2023 12:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

4 minutes ago

ఇక్కడ వైసీపీ విమర్శలు.. అక్కడ కేంద్రం ప్రశంసలు

ఏపీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…

45 minutes ago

మీ సొమ్ము మీరే తీసుకోండి: మోదీ

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆసక్తికర విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…

1 hour ago

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

3 hours ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

4 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

4 hours ago