Political News

మంగళగిరిలో ఓటమికి కారణం చెప్పిన లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్నటితో దిగ్విజయంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబరు 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర పూర్తయిన తర్వాత తన భవిష్యత్ కార్యచరణపై లోకేష్ ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో తన ఓటమికి గల కారణాన్ని లోకేష్ వివరించారు.

ఎన్నికలకు కేవలం 21 రోజుల ముందే మంగళగిరికి వచ్చానని, దీంతో, అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం వీలు కాలేదని చెప్పారు. ఎన్నికలకు ఏడాది ముందే మంగళగిరి వచ్చుంటే ప్రజా సమస్యలు లోకేశ్ కు తెలిసేవని, లోకేశ్ ఏంటో ప్రజలకు తెలిసేదని చెప్పారు. రాజకీయ వారసత్వంతో వచ్చిన తాను టీడీపీకి పెద్దగా పట్టులేని మంగళగిరిని ఛాలెంజింగ్ గా తీసుకొని పోటీ చేశానని అన్నారు.

ఓడిపోయిన క్షణం నుంచి మంగళగిరి ప్రజలకు సేవ చేస్తున్నానని, తన ఫోన్ నంబర్ మంగళగిరిలో చాలామందికి తెలుసని చెప్పారు. ఎవరు ఏ చిన్న మెసేజ్ పెట్టినా యుద్ధ ప్రాతిపదికన వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని అన్నారు. ఈ సారి 53 వేల ఓట్ల మెజారిటీతో మంగళగిరి ప్రజలు తనను ఆశీర్వదిస్తారని భావిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తమ గొంతుక వినిపించేందుకు ఏదైనా వేదిక కావాలని యువకులు కోరడంతో యువగళం మొదలైందని చెప్పారు. పాదయాత్ర ప్రారంభించిన 45 రోజులకే యువగళం ఆంధ్రా గళం అయిందని అన్నారు. పాదయాత్రలో ప్రజల సమస్యలపై అవగాహన పెంచుకున్నానని, స్వయంగా వారి ఇబ్బందులు తెలుసుకున్నానని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని కలిపి అమలు చేయాలన్నదే టీడీపీ లక్ష్యం అని చెప్పారు.

Satya

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

9 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

9 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

11 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

12 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

14 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

14 hours ago