Political News

20 ఏళ్ల త‌ర్వాతైనా.. టీడీపీ అక్క‌డ బోణీ కొట్టేనా..!

ఒక‌టి కాదు.. రెండు కాదు..ఏకంగా 20 ఏళ్ల‌బ‌ట్టి.. టీడీపీ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పల్టీలు కొడుతోంది. రాజ‌ధాని ఇచ్చామ‌ని.. ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని న‌గ‌రాన్ని నిర్మించామ‌ని చెప్పిన 2019 ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ పార్టీ పుంజుకోలేక పోయింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడైనా.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుం దా? విజ‌యం ద‌క్కించుకుంటుందా? అనేది ఆసక్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. అదే.. గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం.

2008కి పూర్వం గుంటూరు-1 నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న ఈ స్థానంలో చిన్న చిన్న మార్పులు చేసి.. గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంగా మార్పు చేశారు. మైనారిటీ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఈ నియోజక‌వ‌ర్గంలో 1983 నుంచి ఇక్క‌డ మైనారిటీ నేత‌లకే అన్ని పార్టీలూ టికెట్ ఇవ్వ‌డం మొద‌లు పెట్టాయి. ఆ త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఇత‌ర సామాజిక వ‌ర్గాల నాయ‌కులు ఇక్క‌డ గెలిచింది కూడా లేదు. 1983లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ప‌టాన్ ఖాన్ విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఆ త‌ర్వాత రెండు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించింది. ఇక‌, 1994-1999 మ‌ధ్య లాల్ జానా భాషా కృషి తో మ‌రోసారి టీడీపీ విజ‌యం ద‌క్కించుకుని.. గెలుపు గుర్రం ఎక్కింది. ఇక‌, ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు(2004-2009-2014-2019) అంటే.. దాదాపు 20 ఏళ్లుగా టీడీపీ ఇక్క‌డ గెలిచిందే లేదు. వాస్త‌వానికి రాజ‌ధాని అమ‌రావ‌తిని ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో టీడీపీ హ‌వా ఇక్క‌డ కూడా ఉంటుంద‌ని అంచ‌నా వేసినా.. ఫ‌లితం అయితే ద‌క్క‌లేదు.

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-టీడీపీ విడివిడిగా పోటీచేయ‌డం.. రెండు పార్టీలూ మైనారిటీలకే టికెట్ ఇవ్వ‌డంతో ఓట్లు బాగా చీలిపోయాయి. టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన న‌జీర్‌కు 54956ఓట్లు రాగా, జ‌న‌సేన త‌ర‌ఫున పోటీకి దిగిన షేక్ రెహ‌మాన్‌కు 22 వేల ఓట్లు వ‌చ్చాయి. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్న ముస్త‌ఫాకు 77 వేల ఓట్లు వ‌చ్చాయి. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన + టీడీపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెడితే.. ఓట్లు చీల‌కుండా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తే.. టీడీపీ ఇక్క‌డ బోణీ కొట్టే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

వెంకీ మామ స్పీడు పెంచుతున్నారు

గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…

20 minutes ago

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

2 hours ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

2 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

3 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

3 hours ago

విజయ్ vs అన్నామలై… అసలు సాధ్యమేనా?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…

4 hours ago