ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా 20 ఏళ్లబట్టి.. టీడీపీ ఆ నియోజకవర్గంలో పల్టీలు కొడుతోంది. రాజధాని ఇచ్చామని.. ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించామని చెప్పిన 2019 ఎన్నికల్లోనూ ఇక్కడ పార్టీ పుంజుకోలేక పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా.. ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుం దా? విజయం దక్కించుకుంటుందా? అనేది ఆసక్తికర చర్చగా మారింది. అదే.. గుంటూరు తూర్పు నియోజకవర్గం.
2008కి పూర్వం గుంటూరు-1 నియోజకవర్గంగా ఉన్న ఈ స్థానంలో చిన్న చిన్న మార్పులు చేసి.. గుంటూరు తూర్పు నియోజకవర్గంగా మార్పు చేశారు. మైనారిటీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో 1983 నుంచి ఇక్కడ మైనారిటీ నేతలకే అన్ని పార్టీలూ టికెట్ ఇవ్వడం మొదలు పెట్టాయి. ఆ తర్వాత.. ఇప్పటి వరకు ఇతర సామాజిక వర్గాల నాయకులు ఇక్కడ గెలిచింది కూడా లేదు. 1983లో టీడీపీ తరఫున పోటీ చేసిన పటాన్ ఖాన్ విజయం దక్కించుకున్నారు.
ఆ తర్వాత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక, 1994-1999 మధ్య లాల్ జానా భాషా కృషి తో మరోసారి టీడీపీ విజయం దక్కించుకుని.. గెలుపు గుర్రం ఎక్కింది. ఇక, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు(2004-2009-2014-2019) అంటే.. దాదాపు 20 ఏళ్లుగా టీడీపీ ఇక్కడ గెలిచిందే లేదు. వాస్తవానికి రాజధాని అమరావతిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో టీడీపీ హవా ఇక్కడ కూడా ఉంటుందని అంచనా వేసినా.. ఫలితం అయితే దక్కలేదు.
2019 ఎన్నికల్లో జనసేన-టీడీపీ విడివిడిగా పోటీచేయడం.. రెండు పార్టీలూ మైనారిటీలకే టికెట్ ఇవ్వడంతో ఓట్లు బాగా చీలిపోయాయి. టీడీపీ తరపున పోటీ చేసిన నజీర్కు 54956ఓట్లు రాగా, జనసేన తరఫున పోటీకి దిగిన షేక్ రెహమాన్కు 22 వేల ఓట్లు వచ్చాయి. ఇక, వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్న ముస్తఫాకు 77 వేల ఓట్లు వచ్చాయి. అయితే.. వచ్చే ఎన్నికల్లో జనసేన + టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే.. ఓట్లు చీలకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తే.. టీడీపీ ఇక్కడ బోణీ కొట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on December 19, 2023 1:39 pm
యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…