రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజంపేటలో పోటీ చేయబోయే అభ్యర్ధి మారిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాదానం వినిపిస్తోంది. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు అభ్యర్ధిగా గంటా నరహరి పోటీ చేయబోతున్నట్లు గతంలో చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ప్రకటించారు. దానికి తగ్గట్లే నరహరి కూడా నియోజకవర్గం వ్యాప్తంగా బాగానే పర్యటించారు. అయితే తర్వాత ఏమైందో ఏమో సడెన్ గా నరహరి కామ్ అయిపోయారు.
అయితే తాజాగా రాజంపేట పార్లమెంటు అభ్యర్ధిగా సుగవాసి సుబ్రమణ్యం పేరు బలంగా వినబడుతోంది. ఈ సుబ్రమణ్యం ఎవరంటే మాజీ ఎంపీ, మాజీ ఎంఎల్ఏ సుగవాసి పాలకొండరాయుడు కొడుకే. సుబ్రమణ్యం గతంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. పాలకొండరాయుడు కడప జిల్లాలో బాగా పాపులర్. ఒకసారి రాజంపేట ఎంపీగా, నాలుగుసార్లు రాయచోటి ఎంఎల్ఏ గా పనిచేశారు. ఇపుడు సడెన్ గా సుగవాసి పేరు ఎందుకు పిక్చర్లోకి వచ్చిందంటే నరహరి రాజంపేట అసెంబ్లీలో పోటీకి మొగ్గుచూపినట్లు సమాచారం.
దశాబ్దాలుగా రాజంపేట పార్లమెంట్ లో ఎక్కువగా బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధులే గెలుస్తున్నారు. 1957, 62 ఎన్నికల్లోను, 2014,19 ఎన్నికల్లోను రెడ్డి సామాజికవర్గం అభ్యర్ధులు గెలిచారు. మిగిలిన 12 ఎన్నికల్లోను బలిజ అభ్యర్ధులే గెలిచారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పార్టీ+బలిజ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటమే. ఇపుడు టీడీపీలో నరహరి అయినా సుగవాసి అయినా ఇద్దరూ బలిజ సామాజికవర్గం నేతలే. అయితే నరహరి ఆర్ధికంగా బాగా గట్టి స్ధితిలో ఉన్నారు. అందుకనే అన్ని కోణాల్లో ఆలోచించిన చంద్రబాబు గతంలోనే నరహరిని పార్లమెంటు అభ్యర్ధిగా ప్రకటించారు.
అయితే తర్వాత ఏమైందో ఏమో ఎవరికీ తెలీదు సడెన్ గా నరహరి వెనక్కు తగ్గినట్లు సమాచారం. అందుకనే చంద్రబాబు మరికొందరి పేర్లను పరిశీలించి సుగవాసి అయితే సరైన అభ్యర్ధి అవుతారని అనుకున్నట్లున్నారు. అందుకనే ఈమధ్యనే జరిగిన సమీక్షా సమావేశంలో సుగవాసిని పోటీకి రెడీగా ఉండమని హింట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. సుగవాసే గనుక అభ్యర్ధి అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున మిథున్ రెడ్డిని ఎదుర్కోవాల్సుంటుంది.
This post was last modified on December 18, 2023 2:24 pm
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…