Political News

రామోజీరావు దగ్గర పని చేసిన పోసాని ఇప్పుదు తిడుతున్నాడు

మీడియా మొఘల్ రామోజీరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నటుడు కం ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని క్రిష్ణ మురళీ. రామోజీపై తీవ్ర విమర్శలు.. ఘాటైన ఆరోపణలు చేసే వేళలో.. గతాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను మార్గదర్శి చిట్ ఫండ్ లో పని చేసిన విషయాన్ని చెబుతూ.. 1985లో సికింద్రాబాద్ బ్రాంచ్ లో తాను మార్గదర్శి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేశానని చెప్పారు. అప్పట్లో తాను రామోజీని నిజాయితీపరుడుగా ఊహించుకునేవాడినని చెప్పారు.

కానీ.. రామోజీ పేదల డబ్బుల్ని దోచుకు తింటున్నట్లుగా ఆరోపించారు. మార్గదర్శి మేనేజర్ ఒక్కొక్కరు నెలకు రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు పేర్కొన్న పోసాని..విద్యార్థులకు జగన్ ప్రభుత్వం ట్యాబ్ లు అందజేస్తే.. వాటిల్లో బూతు వీడియోలు చూస్తున్నారంటూ తప్పుడు రాతలు రాస్తున్నట్లుగా మండిపడ్డారు. రామోజీరావు ఒక పొలిటికల్ బ్రోకర్ అన్న పోసాని.. తన మీడియా సంస్థలో తప్పుడు రాతలు రాస్తూ.. అసభ్య కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు.

లక్ష్మీపార్వతి గురించి రామోజీరావు పిచ్చి రాతలు రాశారన్న మండిపాటును వ్యక్తం చేసిన పోసాని.. కమ్మవాళ్లలో కూడా కేవలం తన చెంచా అయిన చంద్రబాబును మాత్రమే ముఖ్యమంత్రి కావాలని రామోజీరావు కోరుకుంటారన్నారు. అయితే.. రామోజీ మీడియా సంస్థల్లో రాసినట్లు కాకుండా.. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్ లలో అన్ని ఓపెన్ చేయటానికి పర్మిషన్ ఉండదన్నారు. పరిష్మన్ ఉన్న వాటిని తప్ప మరింకేవీ చూడలేరన్నారు.

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండకూడదని కోరుకుంటారని.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలన్నదే రామోజీ కోరికగా పేర్కొన్నారు. సీఎం జగన్ ను రామోజీరావు అకారణంగా ద్వేషిస్తారని మండిపడ్డారు. పోసాని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

This post was last modified on December 17, 2023 10:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యువరాజ్ ఫోన్ చేస్తే ఆ ఆటగాడికి వణుకు

గ్రౌండ్‌లో అభిషేక్ శర్మ స్టైల్, అతడు అలవోకగా కొట్టే సిక్సర్లు చూసి అంతా ఈజీ అనుకుంటారు. కానీ ఆ 'స్వాగ్'…

16 minutes ago

జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?

2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల…

23 minutes ago

పార్లమెంటులో ఈ సిగరెట్ తాగారా?

కొద్ది సంవత్సరాల క్రితం వరకు చట్ట సభలను సభ్యులు పరమ పవిత్రంగా…దేవాలయాల మాదిరిగా చూసేవారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల…

1 hour ago

నాతో నాకే పోటీ అంటున్న అఖండ విలన్

ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…

2 hours ago

బాధను మాయం చేసే ‘స్మృతి’ సీక్రెట్!

పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…

2 hours ago

పంచాతీయ స్వ‌`రూపం`పై జ‌న‌సేన ఎఫెక్ట్ ..!

గ్రామ పంచాయ‌తీల‌పై జ‌న‌సేన పార్టీ ప‌ట్టు బిగించే దిశ‌గా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక స‌దుపాయాల‌ను…

2 hours ago