Political News

‘స్వర్ణ ప్యాలెస్’ కేసు.. సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్

విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో నిర్వహిస్తోన్న కోవిడ్ సెంటర్ లో ఈ ఏడాది ఆగస్టు 9న భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోగా…మరో 20 మంది గాయపడ్డారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఈ కేసులో తన అరెస్ట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ రమేష్ హాస్పటల్స్ యజమాని డాక్టర్ రమేష్ బాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…రమేష్ పై తదుపరి చర్యలు తీసుకోవంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్‌పై గత మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. రమేష్‌తో పాటు హాస్పిటల్ ఛైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. స్వర్ణ ప్యాలెస్‌ను క్వారంటైన్ సెంటర్‌గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలను ఎందుకు బాధ్యులను చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అధికారులను నిందితులుగా చేరుస్తారా? అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతినిచ్చిన అధికారులు కూడా ఈ ఘటనకు బాధ్యులేనని హైకోర్టు అభిప్రాయడింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బందిని బాధ్యులుగా చూపించడం ఏమిటనని హైకోర్టు ప్రశ్నించింది. ఏళ్ల తరబడి ఆ హోటల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని..అక్కడ కోవిడ్‌ సెంటర్‌ నిర్వహణకు అధికారులే అనుమతి ఇచ్చారని హైకోర్టు గుర్తు చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది వారం రోజుల గడువు కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

This post was last modified on September 2, 2020 11:57 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడేళ్ళలో పుష్ప 3 సాధ్యమేనా

ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…

46 seconds ago

బాహుబలి 1 రీ రిలీజ్ – రికార్డులు గల్లంతే

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…

5 minutes ago

సునీతా సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

44 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

2 hours ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

3 hours ago