Political News

‘స్వర్ణ ప్యాలెస్’ కేసు.. సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్

విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో నిర్వహిస్తోన్న కోవిడ్ సెంటర్ లో ఈ ఏడాది ఆగస్టు 9న భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది చనిపోగా…మరో 20 మంది గాయపడ్డారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఈ కేసులో తన అరెస్ట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ రమేష్ హాస్పటల్స్ యజమాని డాక్టర్ రమేష్ బాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు…రమేష్ పై తదుపరి చర్యలు తీసుకోవంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్‌పై గత మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. రమేష్‌తో పాటు హాస్పిటల్ ఛైర్మన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. స్వర్ణ ప్యాలెస్‌ను క్వారంటైన్ సెంటర్‌గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్‌వోలను ఎందుకు బాధ్యులను చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో అధికారులను నిందితులుగా చేరుస్తారా? అని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ కు అనుమతినిచ్చిన అధికారులు కూడా ఈ ఘటనకు బాధ్యులేనని హైకోర్టు అభిప్రాయడింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆస్పత్రి సిబ్బందిని బాధ్యులుగా చూపించడం ఏమిటనని హైకోర్టు ప్రశ్నించింది. ఏళ్ల తరబడి ఆ హోటల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని..అక్కడ కోవిడ్‌ సెంటర్‌ నిర్వహణకు అధికారులే అనుమతి ఇచ్చారని హైకోర్టు గుర్తు చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది వారం రోజుల గడువు కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

This post was last modified on September 2, 2020 11:57 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

9 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

9 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

11 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

11 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

15 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

17 hours ago