Political News

యువ‌గ‌ళం స‌భ‌కు ప‌వ‌న్ డుమ్మా.. రీజ‌నేంటి?

టీడీపీ యువ నాయ‌కుడు, నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ఈ నెల 20తో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో భోగాపురం స‌మీపంలోని పోలంపల్లిలో సుమారు 20 ఎక‌రాల విస్తీర్ణంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన అదినేత‌ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కూడా ఆహ్వానించారు. ఆయ‌న రాక‌తో ఇరు పార్టీల మ‌ధ్య మ‌రింత బంధం బ‌ల‌పేతం అవుతుంద‌ని టీడీపీ నేత‌లు భావించారు. అయితే.. తొలుత ఈ కార్య‌క్ర‌మానికి త‌ప్ప‌కుండా హాజ‌రవుతాన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. త‌ర్వాత‌.. ‘రాలేన‌ని’ క‌బురు పెట్టారు.

తాజాగా ఈ విష‌యాన్ని టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు కూడా ధ్రువీక‌రించారు. యువ‌గ‌ళం ముగింపు స‌భ‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రావ‌డం లేద‌ని తెలిపారు. అయితే.. ఇదేస‌మ‌యంలో ఆయ‌న రాక‌పోయినా.. జ‌న‌సేన నుంచి ఎవ‌రైనా వ‌స్తున్నారా? అన్న దానికి కూడా టీడీపీ దాట వేత ధోర‌ణినే అవ‌లంభించింది. వాస్త‌వానికి తాను రాక‌పోయినా.. త‌న కార్య‌క‌ర్త‌లో లేక ఇత‌ర అగ్ర నాయ‌కుల‌నో ప‌వ‌న్ పంపించే అవ‌కాశం ఉంది. కానీ, ఈ విష‌యంపైనా క్లారిటీ లేకుండా పోయింది. ముఖ్యంగా న‌దెండ్ల మ‌నోహ‌ర్‌, నాగ‌బాబు, దుర్గేష్‌వంటి నాయ‌కులు ఉన్నా.. వారిని పంపించేందుకు పార్టీ సుమ‌ఖుంగా లేన‌ట్టు తెలుస్తోంది.

వాస్త‌వానికి యువ‌గ‌ళం స‌భ ద్వారా టీడీపీ-జ‌న‌సేన‌ల మిత్ర‌ప‌క్ష బంధాన్ని మ‌రింత లోతుగా ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చేయాల‌ని.. వారి కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప్ర‌క‌టించాల‌ని అనుకున్నారు. అంతేకాదు.. ఉమ్మ‌డి మేనిఫెస్టోలోని కీల‌క అంశాల‌ను ఇరు పార్టీల అగ్ర‌నేత‌లు ఈ స‌భా వేదిక నుంచే వివ‌రించాల‌ని కూడా భావించారు. కానీ, అనూహ్యంగా ప‌వ‌న్ ఈ స‌భ‌కు డుమ్మా కొట్టారు. దీనికి కార‌ణంపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. టీడీపీతో బంధాన్ని మెజారిటీ జ‌న‌సేన నాయ‌కులు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్ప‌టికే చాలా జిల్లాల్లో నాయ‌కులు రాజీనామాలు చేశారు.

వీరికి స‌ర్ది చెప్పి.. మిత్రం ప‌క్షం ప్రాధాన్యాన్ని వివ‌రించ‌డంలో ప‌వ‌న్ పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేదు.టీడీపీతో చెలిమిని వ్య‌తిరేకించే వారంతా వైసీపీ సానుభూతిప‌రులు, కోవ‌ర్టులుగా ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో టీడీపీ-జ‌న‌సేన మిత్ర ప‌క్షంపై జ‌నాల మాట ఎలా ఉన్నా.. జ‌న‌సేన‌లోనే ఇంకా లుక‌లుక‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో వారిని శాంత‌ప‌రిచి త‌ర్వాత‌.. మ‌రింత బ‌లంగా ముందుకు సాగాల‌ని పవ‌న్ నిర్ణ‌యించుకుని ఉంటార‌నే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ప‌వ‌న్ ఈ యువ‌గ‌ళం స‌భ‌కు రాక‌పోవ‌డానికి ఇత‌మిత్థంగా కార‌ణం కూడా చెప్ప‌క‌పోవ‌డంతో ఇదే కార‌ణ‌మై ఉంటుంద‌నే అంచ‌నాలు కూడా పెరుగుతున్నాయి.

This post was last modified on December 16, 2023 11:47 pm

Share
Show comments

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

11 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

49 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago