తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ ఎస్నేత, మాజీ మంత్రి కేటీఆర్కు మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం పీసీసీ చీఫ్గా మాట్లాడుతున్నారని.. ఇది గాంధీ భవన్ కాదనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రేవంత్కు పంట బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదని ఆరోపించారు. రేవంత్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని అన్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. ఇసుక మాఫియా అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. 2014-2023 వరకు ఇసుకపై రూ.5వేల కోట్లు వచ్చాయని కేటీఆర్ వివరించారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా ఉండేదని.. అందుకే అప్పట్లో రూ.4 కోట్ల ఆదాయం కూడా రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక ఆదాయం ఎటుపోయిందో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
తెలంగాణ రాకముందు, జవహర్లాల్ నెహ్రూ తరం నాటి రాజకీయాలను ప్రస్తావించడంతో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొలడంతో స్పీకర్ సభను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. అయితే, సభలో భారీ ఎత్తున గందరగోళం నెలకొంది. అధికార పార్టీ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బీఆర్ ఎస్ సభ్యులకు పోటా పోటీగా సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ గెలిచి ఉండకపోతే.. రాష్ట్రం మరో ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేందని శ్రీధర్బాబు అనడంతో బీఆర్ ఎస్ నేతలు ప్రతిఘటించారు. ఈ క్రమంలోనే బుధవారానికి వాయిదా పడింది.
This post was last modified on December 16, 2023 11:33 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…