లగడపాటి రాజగోపాల్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన రాజకీయ నాయకుడు. 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. ఆంధ్రా ఆక్టోపస్ గా ప్రసిద్ధి చెందిన లగడపాటి ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ మరోసారి పొలిటికల్ సర్కిల్లో లగడపాటి పేరు హాట్ టాపిక్ గా మారింది. అతను రాజకీయాల్లోకి పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైందని, టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గెలిచేలా కనిపిస్తున్న అభ్యర్థుల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే లగడపాటి రాజగోపాల్ బాబు కంట్లో పడ్డారనే చెప్పాలి. ఆయన్ని పార్టీలో చేర్చుకుని ఎంపీగా పోటీ చేయించాలని బాబు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్నపుడు బాబుతో లగడపాటి చాలా సార్లు భేటీ అయ్యారు. 2019లోనూ మరోసారి టీడీపీ గెలుస్తుందని లగడపాటి చేసిన సర్వే బోల్తా కొట్టింది. 2019 ఎన్నికల్లోనే ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపించాయి. కానీ ఆయన మాత్రం దూరంగానే ఉన్నారు.
కానీ ఈ సారి మాత్రం కచ్చితంగా లగడపాటి పోటీ చేస్తారనే చెబుతున్నారు. లగడపాటి ఎంపీగా ఉన్న సమయంలో ఆయనతో ఉన్న ముఖ్య అనుచరులు తాజాగా విజయవాడలో సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. వీళ్లంతా కలిసి లగడపాటిని తిరిగి రాజకీయాల్లోకి రావాలని కోరారు. మరోవైపు టీడీపీ కీలక నేతలు కూడా లగడపాటితో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. విజయవాడ, గుంటూరు, ఏలూరులో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని లగడపాటికి చెప్పినట్లు టాక్. కానీ విజయవాడ, గుంటూరులో ప్రస్తుతం టీడీపీ ఎంపీలే ఉన్నారు. అయితే కేశినేని నాని, గల్లా జయదేవ్ పై పార్టీలో అసంత్రుప్తి ఉందని తెలుస్తోంది. అందుకే లగడపాటికి ఈ పార్లమెంట్ నియోజకవర్గాలను బాబు ఆఫర్ చేసినట్లు సమాచారం. లగడపాటి మాత్రం ఏలూరులో తన విజయ అవకాశాలపై సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఏలూరు నుంచి టీడీపీ తరపున లగడపాటి పోటీ చేయడం ఖాయమనే చెప్పాలి.
This post was last modified on December 21, 2023 3:17 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…