Political News

జగన్ ను దెబ్బ కొట్టాలని చాలా కసిగా వున్నాడు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గేమ్ మొదలెట్టారు. తనను కాదన్న వైసీపీని ఓడించేందుకు.. తనను అక్కున చేర్చుకున్న టీడీపీని గెలిపించేందుకు శ్రీధర్ రెడ్డి కదన రంగంలోకి దిగారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. అధికార వైసీపీని వీడినప్పటికీ నియోజకవర్గంలో తన పట్టు నిలబెట్టుకునేందుకు కసరత్తులు మొదలెట్టారు. మొత్తం కుటుంబంతో కలిసి నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ ను గట్టి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో తన నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

2014లో వైసీపీ పార్టీ తరపున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లోనూ విజయ ఢంకా మోగించారు. కానీ ఆ తర్వాత వైసీపీలో ఉండలేకపోయారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిసి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే కారణంతో శ్రీధర్ రెడ్డిని వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయినా తగ్గేదేలే అన్నట్లు శ్రీధర్ రెడ్డి దూసుకెళ్తున్నారు. టీడీపీకి చేరువైన ఆయన.. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచి తీరాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఇంకా అధికారికంగా టీడీపీలో చేరకపోయినప్పటికీ చంద్రబాబు కూడా శ్రీధర్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జీగా శ్రీధర్ రెడ్డిని బాబు నియమించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి, తన చేతిలో ఓడిన అబ్దుల్ అజీజ్ స్థానంలోకి శ్రీధర్ రెడ్డి వచ్చారు. అయితే పార్టీలో ఎలాంటి విభేధాలు లేకుండా, శ్రీధర్ రెడ్డితో కలిసి పనిచేయాలని అజీజ్ ను బాబు ఒప్పించారు. దీంతో నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ క్యాడర్ను కలిపేసుకుంటూ సాగుతున్నారు. భార్య సుజిత, కుమార్తెలు లక్ష్మీ హైందవి, సాయి వైష్ణవిని కూడా శ్రీధర్ రెడ్డి రంగంలోకి దించారు. వీళ్లంతా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీకి మద్దతునివ్వాలంటూ, శ్రీధర్ రెడ్డిని మళ్లీ గెలిపించాలంటూ కోరుతున్నారు.

This post was last modified on December 16, 2023 11:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: kotamreddy

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

3 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

4 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

5 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

5 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

5 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

6 hours ago