రాష్ట్రంలో అధికార వైసీపీలో చెలరేగిన రాజీనామాలు.. పార్టీ ఇంచార్జ్ల మార్పు వంటివి రాజకీయంగానే కాకుండా.. ప్రజల మధ్య కూడా తీవ్రమైన చర్చగానే మారాయి. స్థానికంగా నేతలు కొంత మేరకు ఆందోళన కూడా చేశారు. అయితే.. దీనిపై సాగుతున్న చర్చలో భాగంగా..వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం దక్కిం చుకుంటుంది? ఏ పార్టీకి ఓటేయాలనే చర్చ కూడా సాగుతోంది.
ఏ ఇద్దరు బడ్డీ కొట్టు దగ్గర చేరినా.. వచ్చే ఎన్నికల్లో ఓటెవరికి భాయ్! అనే కామెంటే వినిపిస్తోంది. అయితే.. ఇక్కడ గత 2019 ఎన్నికల వేళ జరిగిన పరిణామాలు కూడా తెరమీదికి వస్తున్నాయి. జనాలకు అమలు చేస్తున్న వివిధ పథకాలు.. సంక్షేమ పాలన నేపథ్యంలో వైసీపీకి నేరుగా ఓటేసేందుకు జనాలు రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ పథకాలు.. గతంలోనూ టీడీపీ ప్రభుత్వం చేసింది కదా! అనే చర్చకూడా వస్తోంది.
నిజమే.. గత టీడీపీ ప్రభుత్వం ఏకంగా ఎన్నికలకు ముందు.. మధ్యలోనూ పసుపు-కుంకుమ పేరుతో మహిళలను కేంద్రంగా చేసుకుని రూ.10 వేలను(4+4+2 వేల చొప్పున) పంచింది. అయినా.. మహిళలు టీడీపీతో లేరు. వైసీపీకి ఓటెత్తారు. ఈ క్రమంలో ఇప్పుడు కూడా.. ఇలానే వైసీపీ ఇస్తున్న సొమ్ములు తీసుకున్నా.. ఓటేస్తారో లేదో అనే చర్చ సాగుతోంది. అయితే.. ఈ విషయంపై వైసీపీ నిర్దిష్ట అభిప్రాయంతో ఉంది.
ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా.. ఎక్కడా క్రమం తప్పకుండా వైసీపీ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోంది. సో.. పోలింగ్ బూత్కు వెళ్లిన మహిళలకు.. ఖచ్చితంగా బటన్ నొక్కే ముందు.. తాను తీసుకున్న సొమ్ము.. తన కుటుంబానికి జరిగిన లబ్ది వంటివి గుర్తుకురావడం ఖాయమని, ఆ విధంగా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అందుకున్నవారిని మోటివేట్ చేయాలని పార్టీ అధిష్టానం సూచనలు చేసిందని నాయకులు చెబుతున్నారు.
This post was last modified on December 16, 2023 3:07 pm
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…