Political News

బ‌ట‌న్ నొక్కే ముందు.. మ‌న‌మే గుర్తుకు రావాలి..

రాష్ట్రంలో అధికార వైసీపీలో చెల‌రేగిన రాజీనామాలు.. పార్టీ ఇంచార్జ్‌ల మార్పు వంటివి రాజ‌కీయంగానే కాకుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా తీవ్ర‌మైన చ‌ర్చ‌గానే మారాయి. స్థానికంగా నేత‌లు కొంత మేర‌కు ఆందోళ‌న కూడా చేశారు. అయితే.. దీనిపై సాగుతున్న చ‌ర్చ‌లో భాగంగా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం ద‌క్కిం చుకుంటుంది? ఏ పార్టీకి ఓటేయాల‌నే చ‌ర్చ కూడా సాగుతోంది.

ఏ ఇద్ద‌రు బ‌డ్డీ కొట్టు ద‌గ్గ‌ర చేరినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటెవ‌రికి భాయ్! అనే కామెంటే వినిపిస్తోంది. అయితే.. ఇక్క‌డ గ‌త 2019 ఎన్నిక‌ల వేళ జ‌రిగిన ప‌రిణామాలు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. జ‌నాల‌కు అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలు.. సంక్షేమ పాల‌న నేప‌థ్యంలో వైసీపీకి నేరుగా ఓటేసేందుకు జ‌నాలు రెడీగా ఉన్నార‌నే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ ప‌థ‌కాలు.. గ‌తంలోనూ టీడీపీ ప్ర‌భుత్వం చేసింది క‌దా! అనే చ‌ర్చ‌కూడా వ‌స్తోంది.

నిజ‌మే.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ఏకంగా ఎన్నిక‌ల‌కు ముందు.. మ‌ధ్య‌లోనూ ప‌సుపు-కుంకుమ పేరుతో మ‌హిళ‌ల‌ను కేంద్రంగా చేసుకుని రూ.10 వేల‌ను(4+4+2 వేల చొప్పున‌) పంచింది. అయినా.. మ‌హిళ‌లు టీడీపీతో లేరు. వైసీపీకి ఓటెత్తారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు కూడా.. ఇలానే వైసీపీ ఇస్తున్న సొమ్ములు తీసుకున్నా.. ఓటేస్తారో లేదో అనే చర్చ సాగుతోంది. అయితే.. ఈ విష‌యంపై వైసీపీ నిర్దిష్ట అభిప్రాయంతో ఉంది.

ఇక్క‌డ వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు కూడా.. ఎక్క‌డా క్ర‌మం త‌ప్ప‌కుండా వైసీపీ ప్ర‌భుత్వం ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. సో.. పోలింగ్ బూత్‌కు వెళ్లిన మ‌హిళ‌ల‌కు.. ఖ‌చ్చితంగా బ‌ట‌న్ నొక్కే ముందు.. తాను తీసుకున్న సొమ్ము.. త‌న కుటుంబానికి జ‌రిగిన ల‌బ్ది వంటివి గుర్తుకురావ‌డం ఖాయ‌మ‌ని, ఆ విధంగా క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుకున్న‌వారిని మోటివేట్ చేయాల‌ని పార్టీ అధిష్టానం సూచ‌న‌లు చేసిందని నాయ‌కులు చెబుతున్నారు.

This post was last modified on December 16, 2023 3:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago