ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన బీజేపీ వచ్చే పార్లమెంటుఎన్నికల్లో మాత్రం కటీఫ్ చెప్పింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళ్లేది లేదని బీజేపీ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి తాజాగా వెల్లడించారు. దీంతో పవన్ను అసెంబ్లీ ఎన్నికల వరకు వాడుకుని వదిలేశారా? లేక.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారనే భావనతో లాభం లేదని అనుకున్నారా? అనే చర్చ రాజకీయంగా ప్రధాన్యం సంతరించుకుంది.
కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు బీజేపీ నాయకులు ఒంటరిగానే సిద్ధం కావాలని కిషన్ రెడ్డి తాజాగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరో పది రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని చెప్పారు. రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలు, లోక్సభ నియోజకవర్గాల ఇంఛార్జిలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. వికసిత భారత్ సంకల్ప యాత్ర, విశ్వకర్మ యోజన పథకాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.
“సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవు. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ ఎస్తో సమాన పోరాటాలు చేయాల్సి ఉంటుంది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి. తెలంగాణలో రాజకీయంగా బీజేపీ నేతలకు, పార్టీకి కూడా మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం ఇదే తరహాలో ఫలితాలిస్తున్నాయి. తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలు పెట్టాలి. కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. కేంద్రంలో మూడోసారి నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడబోతోంది” అని కిషన్ రెడ్డి చెప్పారు.
అయితే.. ఈ సందర్భంగా ఎవరితోనూ పొత్తులు ఉండవని చెప్పడం ద్వారా .. జనసేనతో ఉన్న బంధాన్ని బీజేపీ తెంచుకుందనే అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకే పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు వదిలేయడం వెనుక వ్యూహం ఏదైనా ఉందా? లేక.. ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేశారా? అనే చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on December 16, 2023 8:26 am
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ…
గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా మొదలైపోయిన బాలీవుడ్ రామాయణం చుట్టూ మెల్లగా వివాదాలు మొదలయ్యాయి. తాజాగా నిర్మాత మధు మంతెన…
లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సాయిపల్లవి కలిసి నటిస్తున్న తండేల్ ఈ ఏడాది డిసెంబర్ 20 విడుదల కాబోతున్న…
మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూలు. తెలంగాణలో ఉన్న ఈ మూడు లోక్ సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ…
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న కన్నప్ప షూటింగ్ లో ప్రభాస్ అడుగు పెట్టాడు.…
ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన…