Political News

వాడుకుని వ‌దిలేశారా? లాభం లేద‌నుకున్నారా?

ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నేతృత్వంలోని జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన బీజేపీ వ‌చ్చే పార్ల‌మెంటుఎన్నిక‌ల్లో మాత్రం క‌టీఫ్ చెప్పింది. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు వెళ్లేది లేద‌ని బీజేపీ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి తాజాగా వెల్ల‌డించారు. దీంతో ప‌వ‌న్‌ను అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు వాడుకుని వ‌దిలేశారా? లేక‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయార‌నే భావ‌న‌తో లాభం లేద‌ని అనుకున్నారా? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ప్ర‌ధాన్యం సంత‌రించుకుంది.

కిష‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే..

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ నాయ‌కులు ఒంట‌రిగానే సిద్ధం కావాలని కిషన్‌ రెడ్డి తాజాగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మ‌రో ప‌ది రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని చెప్పారు. రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలు, లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జిలతో కిషన్‌ రెడ్డి సమావేశం అయ్యారు. వికసిత భారత్ సంక‌ల్ప యాత్ర‌, విశ్వకర్మ యోజ‌న‌ పథకాలపై ఈ సంద‌ర్భంగా వారు చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.

“సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవు. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ ఎస్‌తో సమాన పోరాటాలు చేయాల్సి ఉంటుంది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి. తెలంగాణలో రాజకీయంగా బీజేపీ నేత‌ల‌కు, పార్టీకి కూడా మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం ఇదే త‌ర‌హాలో ఫలితాలిస్తున్నాయి. తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలు పెట్టాలి. కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. కేంద్రంలో మూడోసారి నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడబోతోంది” అని కిషన్‌ రెడ్డి చెప్పారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా ఎవ‌రితోనూ పొత్తులు ఉండ‌వ‌ని చెప్ప‌డం ద్వారా .. జ‌న‌సేన‌తో ఉన్న బంధాన్ని బీజేపీ తెంచుకుంద‌నే అర్థంలో ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కే పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు వదిలేయ‌డం వెనుక వ్యూహం ఏదైనా ఉందా? లేక‌.. ఉద్దేశ పూర్వ‌కంగానే ఇలా చేశారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

1 hour ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

2 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

2 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

2 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

3 hours ago

తెలంగాణ పాలిటిక్స్‌: ప‌వ‌న్ భ‌య‌మా… ఓట్ల భ‌య‌మా?

తెలంగాణ రాజ‌కీయాలు వ్యూహాత్మ‌క మ‌లుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్‌, టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఒక్క‌సారిగా జ‌న‌సేన పార్టీపై…

3 hours ago