Political News

వాడుకుని వ‌దిలేశారా? లాభం లేద‌నుకున్నారా?

ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నేతృత్వంలోని జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన బీజేపీ వ‌చ్చే పార్ల‌మెంటుఎన్నిక‌ల్లో మాత్రం క‌టీఫ్ చెప్పింది. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు వెళ్లేది లేద‌ని బీజేపీ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి తాజాగా వెల్ల‌డించారు. దీంతో ప‌వ‌న్‌ను అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు వాడుకుని వ‌దిలేశారా? లేక‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయార‌నే భావ‌న‌తో లాభం లేద‌ని అనుకున్నారా? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ప్ర‌ధాన్యం సంత‌రించుకుంది.

కిష‌న్ రెడ్డి ఏమ‌న్నారంటే..

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న‌ లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ నాయ‌కులు ఒంట‌రిగానే సిద్ధం కావాలని కిషన్‌ రెడ్డి తాజాగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మ‌రో ప‌ది రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారని చెప్పారు. రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జిలు, లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జిలతో కిషన్‌ రెడ్డి సమావేశం అయ్యారు. వికసిత భారత్ సంక‌ల్ప యాత్ర‌, విశ్వకర్మ యోజ‌న‌ పథకాలపై ఈ సంద‌ర్భంగా వారు చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై నేతలకు దిశా నిర్దేశం చేశారు.

“సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఉండవు. తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ ఎస్‌తో సమాన పోరాటాలు చేయాల్సి ఉంటుంది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి. తెలంగాణలో రాజకీయంగా బీజేపీ నేత‌ల‌కు, పార్టీకి కూడా మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం ఇదే త‌ర‌హాలో ఫలితాలిస్తున్నాయి. తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమంపై ప్రచారం మొదలు పెట్టాలి. కొత్తగా ఎన్నికైన 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. కేంద్రంలో మూడోసారి నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడబోతోంది” అని కిషన్‌ రెడ్డి చెప్పారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా ఎవ‌రితోనూ పొత్తులు ఉండ‌వ‌ని చెప్ప‌డం ద్వారా .. జ‌న‌సేన‌తో ఉన్న బంధాన్ని బీజేపీ తెంచుకుంద‌నే అర్థంలో ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కే పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు వదిలేయ‌డం వెనుక వ్యూహం ఏదైనా ఉందా? లేక‌.. ఉద్దేశ పూర్వ‌కంగానే ఇలా చేశారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 16, 2023 8:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

2 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

5 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

5 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

8 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

9 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

9 hours ago