Political News

వైసీపీ మునుగుతున్న నావ‌.. జాగ్ర‌త్త ప‌డండి: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న పిలుపునిచ్చారు. అధికార పార్టీ వైసీపీని మునుగుతున్న నావ‌తో పోల్చారు. ఆ పార్టీలో ఉన్న నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగానే జాగ్రత్త ప‌డాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. “చేతులు కాలాక‌.. నిండా మునిగాక బాధ‌ప‌డి ప్ర‌యోజ‌నం లేదు. ముందుగానే మేల్కొనండి. మీ దారి మీరు చూసుకోండి. ధైర్యం చేయండి” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నావకు చిల్లు పడింద‌న్న ఆయ‌న దాని నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నాయ‌కులు కూడా బయటపడే పరిస్థితి లేదన్నారు. దూకి పారిపోతేనే ప్రాణాలు కాపాడుకుంటారని, లేకపోతే కొట్టుకుపోతారని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు.

ఇప్పటికే వైసీపీలో రాజ‌కీయ ప్రకంపనలు మొదలయ్యాయన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు త‌మ అనుచ‌రుల‌తో టీడీపీలో చేరిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైసీపీని మునిగిపోతున్న నావ‌గా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. “రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో సైకిల్‌ స్పీడ్‌ మరింత పెరుగుతుంది. ఫ్యాన్‌ తిరగడం ఆగిపోతుంది. వారితో విభేదించారనే నెపంతో ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసు కస్టడీలో టార్చర్‌ చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం?” అని ప్ర‌శ్నించారు.

జగన్‌ అన్ని సంప్రదాయాలను సర్వనాశనం చేశారని చంద్ర‌బాబు ఫైర‌య్యారు. అధికారంలోకి వచ్చాక జగన్‌ ఎప్పుడైనా ప్రజలతో మాట్లాడారా? క‌నీసం మీడియాతో అయినా.. మాట్లాడారా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారంటూ.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై నిప్పులు చెరిగారు. “ఎన్నికలకు ముందు ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు. జగన్‌ ఒక అపరిచితుడు. చెప్పింది ఒక్కటీ చేయడు. తల్లికి, చెల్లికి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడు” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. వైసీపీ ఇప్పుడు 11 మంది ఇన్‌ఛార్జిలను మార్చారని, రాబోయే కొద్ది వారాల్లోనే 151 మందిని మార్చినా రాష్ట్రంలో ఆ పార్టీ గెలిచే పరిస్థితి లేదని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు.

వెనుకబడిన వర్గాలను బలపరిస్తేనే సామాజిక న్యాయం ద‌క్కుతుంద‌ని చంద్ర‌బాబు అభిప్రాయ‌ప‌డ్డారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జ‌గ‌న్‌.. కేంద్రం మెడలు వంచలేదు కానీ.. త‌న‌ మెడలు ఒంచుకున్నార‌ని వ్యాఖ్యానించారు. పోలవరం పనులు త‌న హ‌యాంలోనే 72శాతం పూర్తయ్యాయని చంద్ర‌బాబు తెలిపారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే వాళ్లమ‌ని చెప్పారు. ఇప్పుడు.. అస‌లు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నుమ‌రుగు అవుతుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు.

This post was last modified on December 15, 2023 11:00 pm

Share
Show comments

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 minutes ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago