తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకుంది. అయితే, మహిళలంతా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ ఉండటంతో మెట్రో రైలుతోపాటు ఆటోల వంటి ప్రైవేటు వాహనాలకు గిరాకీ తగ్గింది. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి పథకంపై భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉండకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మహాలక్ష్మి పథకం రావడానికి ముందు 70 శాతం మంది మహిళలు ఆటో ఎక్కే వారిని, ఆనాడు 1000 రూపాయలు ఉండే రోజు వారి సంపాదన ఇప్పుడు 300 కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంతో తమ పొట్ట కొట్టారని, కాబట్టి ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఆటోలను పెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే బస్సుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గత ప్రభుత్వం రవాణా చట్టానికి తూట్లు పొడుస్తూ ఓలా, ఉబర్ క్యాబ్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని, ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో తమ జీవనోపాధికి గండి కొట్టిందని వారు వాపోతున్నారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆటో సంఘాలతో చర్చలు జరిపి న్యాయం చేయకుంటే ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని, ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 8 లక్షల ఆటో డ్రైవర్ల భవిష్యత్తు అంధకారంలో ఉందని, ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, మహాలక్ష్మి పథకంతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కు వచ్చి పడినట్లయింది.
This post was last modified on December 15, 2023 10:48 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…