తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకుంది. అయితే, మహిళలంతా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ ఉండటంతో మెట్రో రైలుతోపాటు ఆటోల వంటి ప్రైవేటు వాహనాలకు గిరాకీ తగ్గింది. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి పథకంపై భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉండకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మహాలక్ష్మి పథకం రావడానికి ముందు 70 శాతం మంది మహిళలు ఆటో ఎక్కే వారిని, ఆనాడు 1000 రూపాయలు ఉండే రోజు వారి సంపాదన ఇప్పుడు 300 కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంతో తమ పొట్ట కొట్టారని, కాబట్టి ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఆటోలను పెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే బస్సుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గత ప్రభుత్వం రవాణా చట్టానికి తూట్లు పొడుస్తూ ఓలా, ఉబర్ క్యాబ్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని, ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో తమ జీవనోపాధికి గండి కొట్టిందని వారు వాపోతున్నారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆటో సంఘాలతో చర్చలు జరిపి న్యాయం చేయకుంటే ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని, ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 8 లక్షల ఆటో డ్రైవర్ల భవిష్యత్తు అంధకారంలో ఉందని, ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, మహాలక్ష్మి పథకంతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కు వచ్చి పడినట్లయింది.
This post was last modified on December 15, 2023 10:48 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…