Political News

మహాలక్ష్మి పథకం..ప్రభుత్వానికి ఆటో డ్రైవర్ల అల్టిమేటం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకుంది. అయితే, మహిళలంతా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ ఉండటంతో మెట్రో రైలుతోపాటు ఆటోల వంటి ప్రైవేటు వాహనాలకు గిరాకీ తగ్గింది. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మి పథకంపై భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అండగా ఉండకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మహాలక్ష్మి పథకం రావడానికి ముందు 70 శాతం మంది మహిళలు ఆటో ఎక్కే వారిని, ఆనాడు 1000 రూపాయలు ఉండే రోజు వారి సంపాదన ఇప్పుడు 300 కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంతో తమ పొట్ట కొట్టారని, కాబట్టి ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఆటోలను పెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే బస్సుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గత ప్రభుత్వం రవాణా చట్టానికి తూట్లు పొడుస్తూ ఓలా, ఉబర్ క్యాబ్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని, ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో తమ జీవనోపాధికి గండి కొట్టిందని వారు వాపోతున్నారు.

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఆటో సంఘాలతో చర్చలు జరిపి న్యాయం చేయకుంటే ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామని, ప్రజా భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. 8 లక్షల ఆటో డ్రైవర్ల భవిష్యత్తు అంధకారంలో ఉందని, ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో, మహాలక్ష్మి పథకంతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కు వచ్చి పడినట్లయింది.

This post was last modified on December 15, 2023 10:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago