తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తర్వాత జరిగిన పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. పారిశ్రామిక దిగ్గజాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు, బులియన్ మార్కెట్ నుంచి ఇతర వ్యాపార వర్గాల వరకు కూడా.. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చేస్తారని భావించినట్టు తాజాగా ఓ సర్వే వెల్లడించింది. దీంతో వారంతా.. కేసీఆర్కు అనుకూలంగా వ్యవహరించారని తెలిపింది.
కేవలం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య కాలంలో.. అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఒక నెల ముందు వరకు కోట్లకు కోట్ల రూపాయలను బీఆర్ ఎస్ పార్టీకి విరాళాలుగా ఇచ్చినట్టు తెలుస్తొంది. తాజాగా బీఆర్ ఎస్ ఆస్తులు ఎంత అనే విషయాన్ని ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రస్తుతంబీఆర్ ఎస్ ఆస్తులు గత రెండేళ్లలో 1136 కోట్ల రూపాయలుగా తేలింది.
అయితే.. దీనిలో గత ఏడాది అంటే.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 198 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయి. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలకు ముందు ఆరు మాసాల్లో మాత్రం రూ.938 కోట్లు విరాళాలుగా అందినట్టు పేర్కొంది. ఇది దేశంలో ఏ పార్టీకీ ఇంత తక్కువ సమయంలో అందలేదని కూడా పేర్కొంది. అయితే.. ఈ వివరాలను పరిశీలనలోకి తీసుకున్న అసోచామ్ సర్వే.. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి తదితర కీలక జిల్లాల్లో వ్యాపార వర్గాలు మరోసారి కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసినట్టు చెబుతోంది.
అందుకే లెక్కకు మిక్కిలిగా కోట్ల రూపాయల కనక వర్షాన్ని కురిపించినట్టు సర్వే వెల్లడించింది. కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే.. తమ వ్యాపారాలు పుంజుకుంటాయని.. లేదా.. తమకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇలా భారీ ఎత్తున భూరి విరాళాలు సమర్పించి ఉంటారని అసోచామ్ వెల్లడించడం గమనార్హం. అయితే.. ఎవరు ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారనే వివరాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. కానీ, తాజాగా ఎన్నికల్లోకేసీఆర్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే.
This post was last modified on December 15, 2023 8:08 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…