ఎన్నికలకు నాలుగు మాసాల గడువు ఉండగానే ఏపీలో ఓట్ల రాజకీయం ఊపందుకుంది. అధికార పార్టీ వైసీపీపై ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలు నిప్పులు చెరుగుతున్నాయి. తమ ఓట్లు తొలగిస్తున్నారని.. దొంగ ఓట్లు చేరుస్తున్నారన్నది ఈ రెండు పార్టీల ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ కూడా సంధించారు. ఈ వారంలోనే ఆయన ఎన్నికల సంఘాన్ని నేరుగా కలవాలని అనుకున్నారు. కానీ.. ఈ పర్యటన వాయిదా పడింది.
ఇక, జనసేన నాయకులు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులకు దొంగ ఓట్లపై ఫిర్యాదులు చేశారు. తమకు అనుకూలంగా ఉన్నారనే కారణంగా..అనేక మంది ఓట్లను తొలగించారని ఆధారాలతో సహా పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగా నే ఓట్లు తొలగించాలని కోరుతూ.. ఫాం-7లు దాఖలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. మరోవైపు వైసీపీ కూడా ఇదే వాదనను తెరమీదికి తెచ్చింది.
తమ పార్టీ అనుకూల, సానుభూతి ఓట్లను ఈ రెండు పార్టీలు ఫాం-7 ద్వారా తొలగిస్తున్నారని ఆ పార్టీ కూడా ఫిర్యాదులు చేసింది. అయితే.. వీటిపై రాష్ట్రస్థాయిలో అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. అయి నప్పటికీ.. సంతృప్తి చెందని అన్ని పార్టీలూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ రూపాల్లో ఫిర్యాదులు సమ ర్పించాయి. మరో నాలుగు మాసాల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదుల గుట్టలు చూసి ఎన్నికల సంఘం తలపట్టుకుంది.
అధికార పార్టీ ప్రతిపక్షాలపైనా.. ప్రతిపక్షాలు అధికార పార్టీపైనా పరస్పరం చేసుకున్న ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించింది. ఈ బృందం వచ్చే వారంలో ఏపీలో పర్యటించి.. అసలు ఏం జరుగుతోందనే విషయంపై ఆరా తీయనుంది. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులు.. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 15, 2023 3:56 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…