ఎన్నికలకు నాలుగు మాసాల గడువు ఉండగానే ఏపీలో ఓట్ల రాజకీయం ఊపందుకుంది. అధికార పార్టీ వైసీపీపై ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేనలు నిప్పులు చెరుగుతున్నాయి. తమ ఓట్లు తొలగిస్తున్నారని.. దొంగ ఓట్లు చేరుస్తున్నారన్నది ఈ రెండు పార్టీల ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ కూడా సంధించారు. ఈ వారంలోనే ఆయన ఎన్నికల సంఘాన్ని నేరుగా కలవాలని అనుకున్నారు. కానీ.. ఈ పర్యటన వాయిదా పడింది.
ఇక, జనసేన నాయకులు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులకు దొంగ ఓట్లపై ఫిర్యాదులు చేశారు. తమకు అనుకూలంగా ఉన్నారనే కారణంగా..అనేక మంది ఓట్లను తొలగించారని ఆధారాలతో సహా పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు ఉద్దేశ పూర్వకంగా నే ఓట్లు తొలగించాలని కోరుతూ.. ఫాం-7లు దాఖలు చేస్తున్నారని కూడా ఆరోపించారు. మరోవైపు వైసీపీ కూడా ఇదే వాదనను తెరమీదికి తెచ్చింది.
తమ పార్టీ అనుకూల, సానుభూతి ఓట్లను ఈ రెండు పార్టీలు ఫాం-7 ద్వారా తొలగిస్తున్నారని ఆ పార్టీ కూడా ఫిర్యాదులు చేసింది. అయితే.. వీటిపై రాష్ట్రస్థాయిలో అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. అయి నప్పటికీ.. సంతృప్తి చెందని అన్ని పార్టీలూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ రూపాల్లో ఫిర్యాదులు సమ ర్పించాయి. మరో నాలుగు మాసాల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫిర్యాదుల గుట్టలు చూసి ఎన్నికల సంఘం తలపట్టుకుంది.
అధికార పార్టీ ప్రతిపక్షాలపైనా.. ప్రతిపక్షాలు అధికార పార్టీపైనా పరస్పరం చేసుకున్న ఫిర్యాదులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించింది. ఈ బృందం వచ్చే వారంలో ఏపీలో పర్యటించి.. అసలు ఏం జరుగుతోందనే విషయంపై ఆరా తీయనుంది. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదులు.. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 15, 2023 3:56 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…