తెలంగాణలో 10 సంవత్సరాలు పాలన సాగించిన.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భద్రత తగ్గించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. వాస్తవానికి కేసీఆర్కు ఎలాంటి హెచ్చరికలూ లేవు. గతంలో కొంత మేరకు మావోయిస్టుల ప్రభావం ఉన్నా.. ఇప్పుడు ఆ ప్రబావం కూడా లేకపోవడంతో.. కేసీఆర్ ఎలాంటి హెచ్చరికల జాబితాలో కూడా లేరని ఆ పార్టీనే కొన్నాళ్ల కిందట(ఎన్నికలకు ముందు) ప్రకటించుకుంది.
అయితే.. సహజంలోనే సమాజంలో మారిన ప్రబుత్వం పట్ల అసంతృప్తి ఉంటుంది కాబట్టి.. మాజీ సీఎంగా ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం, ప్రొటోకాల్ ప్రకారం భద్రత వంటివి కొనసాగుతాయి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఉన్న Z+ కేటగిరి భద్రతను Y కేటగిరిగా మార్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అయితే.. దీనికి సంబందించి కేంద్ర హోం శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక, Z+ కేటగిరి భద్రతను Y కేటగిరిగా మార్చితే.. కేసీఆర్ భద్రతకు 4+4 సిబ్బందినే వినియోగిస్తారు. కాగా, ఇప్పటి వరకు డీఎస్పీ స్థాయి అధికారి.. కేసీఆర్ భద్రతకు ఇంచార్జ్గా వ్యవహరిస్తున్నారు. 4+4కు మారితో సీఐ స్థాయి అధికారికే పరిమితం అవుతారు. ఇక, కేసీఆర్ ఇంటి వద్ద సెంట్రీ యథాతథంగా ఉన్నా.. ఇక్కడ కూడా.. 12 నుంచి 8 మందికి సిబ్బందిని తగ్గిస్తారు. అదేవిధంగా ఆయన కాన్వాయ్లో రెండు పోలీసు వాహనాలు మాత్రమే ఉంటాయి.
అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వివరణ ప్రకారం.. ఇవన్నీ. కూడా హైదరాబాద్కే పరిమితం కానున్నాయి. ఆయన పొరుగు రాష్ట్రం లేదా.. ఏదైనా నక్సల్ ఎఫెక్టెడ్ జిల్లాలకు వెళ్లాలని అనుకుంటే.. ప్రత్యేక భద్రతను కల్పిస్తారు. ఆ జిల్లా సిబ్బందితోపాటు.. ఆయనకు ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం Y కేటగిరి భద్రత ఇవ్వనున్నారు.
This post was last modified on December 15, 2023 3:43 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…