Political News

వారు.. వీరు.. 30 మంది కొత్త‌వారు: వైసీపీ ఎన్నిక‌ల పంజా!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఏపీలో ఒకే విడ‌త‌లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రెండు ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు వైసీపీ ఎన్నిక‌ల పంజా విసురుతోంది. ఈ క్ర‌మంలో త‌న మ‌న అనే తేడా లేకుండా.. గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు సంకేతాలు కూడా పంపే సింది. ఇప్ప‌టికే కీల‌క‌మైన ఆళ్ల రామ‌కృష్నారెడ్డి రాజీనామాతో ప్రారంభ‌మైన ఈ ప‌రంప‌ర మ‌రింత వేగంగా ముందుకు సాగుతుంద‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 25 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ద్వారా.. కేంద్రంలో నూ చ‌క్రం తిప్పాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకుంద‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌లలో 22 మంది పార్ల‌మెంటు అభ్య‌ర్థుల‌ను గెలిపించుకున్న వైసీపీకి కేంద్రంలోని మోడీ స‌ర్కారు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఏపీకి ఏమీ చేయ‌కుండా ప‌ద‌వులు ఇస్తే.. ప్ర‌యోజ‌నం ఏంట‌న్న ధోర‌ణిలో ఆ పార్టీ ప‌ద‌వులు తీసుకునేందుకు దూరంగా ఉంది.

అయితే.. ఈ సారి మాత్రం ప‌ద‌వులు తీసుకుని.. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడాల‌నే నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేయాల‌ని చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో 25 స్థానాల‌పైనా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. ఇక‌, రాష్ట్రంలో వైనాట్ 175 నినాదాన్ని కూడా బ‌లంగా తీసుకువెళ్లాల‌ని.. అన్ని సీట్ల‌లోనూ విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఎంపీ స్థానాల్లో ఉన్న‌వారిని అసెంబ్లీకి పంపించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ద‌ఫా ఏకంగా 30 మంది కొత్త ముఖాల‌కు టికెట్‌లు ఇవ్వాల‌ని.. వీరిలో 20 మంది మ‌హిళా నేత‌ల‌నే ఎంచుకోవ‌డం ద్వారా రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల్లో ఎలాగైతే.. 50 శాతం మ‌హిళా కోటా అమ‌లు చేశారో.. ఇప్పుడు 33 శాతం మంది మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ చోటు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఎమ్మెల్యేల్లో బ‌ల‌మైన వారిని పార్ల‌మెంటు అభ్య‌ర్థులుగా.. ఈ స్థానాల్లోని వారిని అసెంబ్లీకి, అదేస‌మ‌యంలో 30 మంది కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 15, 2023 3:43 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

1 hour ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

1 hour ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 hour ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago