Political News

వారు.. వీరు.. 30 మంది కొత్త‌వారు: వైసీపీ ఎన్నిక‌ల పంజా!

వ‌చ్చే అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఏపీలో ఒకే విడ‌త‌లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రెండు ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు వైసీపీ ఎన్నిక‌ల పంజా విసురుతోంది. ఈ క్ర‌మంలో త‌న మ‌న అనే తేడా లేకుండా.. గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే టికెట్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు సంకేతాలు కూడా పంపే సింది. ఇప్ప‌టికే కీల‌క‌మైన ఆళ్ల రామ‌కృష్నారెడ్డి రాజీనామాతో ప్రారంభ‌మైన ఈ ప‌రంప‌ర మ‌రింత వేగంగా ముందుకు సాగుతుంద‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో 25 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ద్వారా.. కేంద్రంలో నూ చ‌క్రం తిప్పాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకుంద‌ని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌లలో 22 మంది పార్ల‌మెంటు అభ్య‌ర్థుల‌ను గెలిపించుకున్న వైసీపీకి కేంద్రంలోని మోడీ స‌ర్కారు మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేసింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఏపీకి ఏమీ చేయ‌కుండా ప‌ద‌వులు ఇస్తే.. ప్ర‌యోజ‌నం ఏంట‌న్న ధోర‌ణిలో ఆ పార్టీ ప‌ద‌వులు తీసుకునేందుకు దూరంగా ఉంది.

అయితే.. ఈ సారి మాత్రం ప‌ద‌వులు తీసుకుని.. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం పోరాడాల‌నే నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేయాల‌ని చూస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో 25 స్థానాల‌పైనా ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. ఇక‌, రాష్ట్రంలో వైనాట్ 175 నినాదాన్ని కూడా బ‌లంగా తీసుకువెళ్లాల‌ని.. అన్ని సీట్ల‌లోనూ విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఎంపీ స్థానాల్లో ఉన్న‌వారిని అసెంబ్లీకి పంపించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ ద‌ఫా ఏకంగా 30 మంది కొత్త ముఖాల‌కు టికెట్‌లు ఇవ్వాల‌ని.. వీరిలో 20 మంది మ‌హిళా నేత‌ల‌నే ఎంచుకోవ‌డం ద్వారా రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల్లో ఎలాగైతే.. 50 శాతం మ‌హిళా కోటా అమ‌లు చేశారో.. ఇప్పుడు 33 శాతం మంది మ‌హిళ‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లోనూ చోటు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తంగా ఎమ్మెల్యేల్లో బ‌ల‌మైన వారిని పార్ల‌మెంటు అభ్య‌ర్థులుగా.. ఈ స్థానాల్లోని వారిని అసెంబ్లీకి, అదేస‌మ‌యంలో 30 మంది కొత్త‌వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 15, 2023 3:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

10 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago