మామూలుగా అయితే వేటాడాలంటే వేటగాడికి చాలా ఓపిక, నేర్పు ఉండాలి. కానీ ఇక్కడ ఎరలు వేయకుండానే వేట జరిగిపోతోంది. దానికి కారణం ఏమిటంటే వేటాడే విషయంలో వేటగాడికి పెద్ద శ్రమలేకుండా వచ్చి వలలో పడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ముందు మాజీ ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపైన పోలీసులు కేసులు పెట్టారు. అప్పులు ఎగ్గొట్టిన, కట్టాల్సిన బకాయిలు కట్టని కారణంగా జీవన్ పై కేసులు నమోదయ్యాయి. ఆస్తుల జప్తుకు నోటీసులు కూడా ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది.
ఆ వేడి చల్లారకముందే మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్ఏ మల్లారెడ్డి మీద శామీర్ పేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఏమి కేసంటే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎందుకంటే ఎస్టీల భూములు 47 ఎకరాల 18 గుంటలు ఆక్రమించుకుని సొంతం చేసేసుకున్నారట. నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన కొందరు ఎస్టీలు పోలీసుస్టేషన్లో మాజీమంత్రిపై ఫిర్యాదుచేశారు. భూకబ్జా ఆరోపణలపై మాజీమంత్రితో పాటు అనుచరులు ఆరుమందిపైన కూడా కేసులు నమోదయ్యాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పదేళ్ళ బీఆర్ఎస్ అధికారంలో చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు ఆకాశమేహద్దుగా రెచ్చిపోయారు. కంటికి కనబడినన్ని భూములు కబ్జాచేశారు. ఆ ఆక్రమణలకు గురైన భూముల్లో చెరువులు, కుంటలు కూడా ఉన్నాయి. ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూములను దేన్నీ వదలలేదు. భూకబ్జాలపై జనాలు ఎంత గోలచేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. దాంతో ప్రజాప్రతినిధులు మరింతగా రెచ్చిపోయారు.
అప్పటి ఫిర్యాదులన్నింటినీ ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుమ్ముతెలిపి బయటకు తీస్తోంది. అలాగే రకరకాలుగా అప్పులు తీసుకుని కొందరు కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఇలాంటి ఫిర్యాదులపై రేవంత్ ప్రభుత్వం స్పీడుగా యాక్షన్ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జీవన్, మల్లారెడ్డిపైన కేసులు. పల్లా రాజేశ్వరరెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ తదితర నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నేతలపైన కూడా చాలా కేసులున్నాయి. వీటిన్నింటినీ ప్రభుత్వం బయటకు తీస్తోంది. నాలుగురోజులు పోతే ఇంకెంతమంది బాగోతాలు బయటకు వస్తాయో చూడాలి.
This post was last modified on December 15, 2023 12:11 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…