మామూలుగా అయితే వేటాడాలంటే వేటగాడికి చాలా ఓపిక, నేర్పు ఉండాలి. కానీ ఇక్కడ ఎరలు వేయకుండానే వేట జరిగిపోతోంది. దానికి కారణం ఏమిటంటే వేటాడే విషయంలో వేటగాడికి పెద్ద శ్రమలేకుండా వచ్చి వలలో పడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ముందు మాజీ ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపైన పోలీసులు కేసులు పెట్టారు. అప్పులు ఎగ్గొట్టిన, కట్టాల్సిన బకాయిలు కట్టని కారణంగా జీవన్ పై కేసులు నమోదయ్యాయి. ఆస్తుల జప్తుకు నోటీసులు కూడా ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది.
ఆ వేడి చల్లారకముందే మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్ఏ మల్లారెడ్డి మీద శామీర్ పేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఏమి కేసంటే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎందుకంటే ఎస్టీల భూములు 47 ఎకరాల 18 గుంటలు ఆక్రమించుకుని సొంతం చేసేసుకున్నారట. నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన కొందరు ఎస్టీలు పోలీసుస్టేషన్లో మాజీమంత్రిపై ఫిర్యాదుచేశారు. భూకబ్జా ఆరోపణలపై మాజీమంత్రితో పాటు అనుచరులు ఆరుమందిపైన కూడా కేసులు నమోదయ్యాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పదేళ్ళ బీఆర్ఎస్ అధికారంలో చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు ఆకాశమేహద్దుగా రెచ్చిపోయారు. కంటికి కనబడినన్ని భూములు కబ్జాచేశారు. ఆ ఆక్రమణలకు గురైన భూముల్లో చెరువులు, కుంటలు కూడా ఉన్నాయి. ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూములను దేన్నీ వదలలేదు. భూకబ్జాలపై జనాలు ఎంత గోలచేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. దాంతో ప్రజాప్రతినిధులు మరింతగా రెచ్చిపోయారు.
అప్పటి ఫిర్యాదులన్నింటినీ ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుమ్ముతెలిపి బయటకు తీస్తోంది. అలాగే రకరకాలుగా అప్పులు తీసుకుని కొందరు కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఇలాంటి ఫిర్యాదులపై రేవంత్ ప్రభుత్వం స్పీడుగా యాక్షన్ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జీవన్, మల్లారెడ్డిపైన కేసులు. పల్లా రాజేశ్వరరెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ తదితర నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నేతలపైన కూడా చాలా కేసులున్నాయి. వీటిన్నింటినీ ప్రభుత్వం బయటకు తీస్తోంది. నాలుగురోజులు పోతే ఇంకెంతమంది బాగోతాలు బయటకు వస్తాయో చూడాలి.
ఇప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ డైౌరెక్టర్ ఎవరు అని పోల్ పెడితే.. తిరుగులేని ఆధిక్యంతో క్రిస్టోఫర్ నోలనే గెలుస్తాడు అనడంలో…
గత శుక్రవారం ‘సింగ్గీతం’ చిత్రం విడుదల కావడానికి ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. 94 ఏళ్ల వయసులో సింగీతం ఓపిగ్గా…
గత ఎన్నికల సమయంలో మంగళగిరిలోని ప్రతి వీధిలోనూ పర్యటించిన నారా లోకేష్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ప్రభుత్వం…
విడుదల ఎప్పుడు ఉంటుందో కానీ కల్కి 2 మీద అంచనాలు మాములుగా లేవు. కల్కి 2898 ఏడి గొప్ప విజయమే…
అక్కినేని నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్లది కల్ట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘మనం’ ఎంత పెద్ద…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. సాధారణంగా జూన్ వచ్చిందంటే.. ఎండలు తగ్గుముఖం పట్టి..…