మామూలుగా అయితే వేటాడాలంటే వేటగాడికి చాలా ఓపిక, నేర్పు ఉండాలి. కానీ ఇక్కడ ఎరలు వేయకుండానే వేట జరిగిపోతోంది. దానికి కారణం ఏమిటంటే వేటాడే విషయంలో వేటగాడికి పెద్ద శ్రమలేకుండా వచ్చి వలలో పడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ముందు మాజీ ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపైన పోలీసులు కేసులు పెట్టారు. అప్పులు ఎగ్గొట్టిన, కట్టాల్సిన బకాయిలు కట్టని కారణంగా జీవన్ పై కేసులు నమోదయ్యాయి. ఆస్తుల జప్తుకు నోటీసులు కూడా ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది.
ఆ వేడి చల్లారకముందే మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్ఏ మల్లారెడ్డి మీద శామీర్ పేట పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఏమి కేసంటే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎందుకంటే ఎస్టీల భూములు 47 ఎకరాల 18 గుంటలు ఆక్రమించుకుని సొంతం చేసేసుకున్నారట. నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన కొందరు ఎస్టీలు పోలీసుస్టేషన్లో మాజీమంత్రిపై ఫిర్యాదుచేశారు. భూకబ్జా ఆరోపణలపై మాజీమంత్రితో పాటు అనుచరులు ఆరుమందిపైన కూడా కేసులు నమోదయ్యాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పదేళ్ళ బీఆర్ఎస్ అధికారంలో చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు ఆకాశమేహద్దుగా రెచ్చిపోయారు. కంటికి కనబడినన్ని భూములు కబ్జాచేశారు. ఆ ఆక్రమణలకు గురైన భూముల్లో చెరువులు, కుంటలు కూడా ఉన్నాయి. ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూములను దేన్నీ వదలలేదు. భూకబ్జాలపై జనాలు ఎంత గోలచేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. దాంతో ప్రజాప్రతినిధులు మరింతగా రెచ్చిపోయారు.
అప్పటి ఫిర్యాదులన్నింటినీ ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుమ్ముతెలిపి బయటకు తీస్తోంది. అలాగే రకరకాలుగా అప్పులు తీసుకుని కొందరు కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఇలాంటి ఫిర్యాదులపై రేవంత్ ప్రభుత్వం స్పీడుగా యాక్షన్ తీసుకుంటోంది. ఇందులో భాగంగానే జీవన్, మల్లారెడ్డిపైన కేసులు. పల్లా రాజేశ్వరరెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ తదితర నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నేతలపైన కూడా చాలా కేసులున్నాయి. వీటిన్నింటినీ ప్రభుత్వం బయటకు తీస్తోంది. నాలుగురోజులు పోతే ఇంకెంతమంది బాగోతాలు బయటకు వస్తాయో చూడాలి.
This post was last modified on December 15, 2023 12:11 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…
గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…
కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాన్ని త్వరలోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్లుగా విభజించుకుని అభివృద్ధి…
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…