ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన పంచ్ కు.. జనసేన ఘాటుగా రియాక్టు అయ్యింది. ఆయన మాటకు అంతే ధీటుగా స్పందిస్తూ.. కౌంటర్ ఇచ్చేసింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీకి బర్రెలక్క కంటే తక్కువఓట్లు వచ్చాయంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్య చేయటం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన సభలో మాట్లాడిన జగన్..జనసేన మీదా.. అధినేత పవన్ మీదా విరుచుకుపడ్డారు. ప్యాకేజీ స్టార్ అంటూ తరచూ పంచ్ లు విసిరే ఆయన.. తాజాగా మ్యారేజ్ స్టార్ అంటూ కొత్త పదాన్ని కలిపారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన స్పందించింది.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి తెలంగాణలో వచ్చిన ఓట్ల మాటేంటి? అంటూ ప్రశ్నించటమే కాదు.. అందుకు తగ్గ ఆధారాల్ని చూపిస్తూ కౌంటర్ వేశారు. 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నోటా కంటే 56 స్థానాల్లో తక్కువ ఓట్లు వచ్చాయన్న విషయాన్ని జనసేన వెలుగులోకి తెచ్చింది. అంతేకాదు.. ఏ బర్రెలక్క పేరుతో పంచ్ వేసిన జగన్ కు ఆమె పేరు మీదనే విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేసే దమ్ము బర్రెలక్కకైనా ఉంది కానీ తెలంగాణలో పోటీ చేసే దమ్ము జగన్ కు.. వైసీపీకి లేదన్నారు. అదే విషయాన్ని తాజా వ్యాఖ్యలతో జగనే చెప్పుకున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. సెల్ఫ్ గోల్ వేసుకోవటం జగన్ కు మించిన సీబీఐ దత్తపుత్రుడు లేడంటూ మండిపడటం గమనార్హం. “2014 తెలంగాణ ఎన్నికల్లో నీ పార్టీకి వచ్చిన ఓట్లు.. తెలంగాణ ప్రజలు నిన్ను రాళ్లతో కొట్టిన తీరు మర్చిపోయావా?” అంటూ గతాన్ని గుర్తు చేస్తూ వేస్తున్న ప్రశ్నల జోరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
తాము ధైర్యంగా నిలబడ్డామని.. ఏదో ఒక రోజు గెలుస్తామని పేర్కొన్న జనసైనికులు.. నీలా పారిపోలేదు.. రాళ్లతో కొట్టించుకోలేదంటూ పేర్కొన్నారు. అంతేకాదు.. 2014లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో నోటా కంటే వైసీపీకి తక్కువగా వచ్చిన నియోజకవర్గాల జాబితాను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదంతా చూసినోళ్లు.. బర్రెలక్క ప్రస్తావన తెచ్చి జగన్ తప్పు చేశారన్న మాట వినిపిస్తోంది. కాస్తంత కసరత్తు చేసి విమర్శలు సంధిస్తే బాగుంటుందే తప్పించి.. ఇలా అడ్డదిడ్డంగా అనేస్తే.. అంతకు రెట్టింపు మాటల్ని పడాల్సి వస్తుందంటూ హితవు పలుకుతున్నారు.
This post was last modified on December 15, 2023 11:09 am
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…