Political News

రేవంత్ టీంలోకి ఆమ్రపాలి..కీలక బాధ్యతలు

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగిన సంగతి తెలిసిందే. జిహెచ్ఎంసి పరిధిలో ముగ్గురు కొత్త కమిషనర్లను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. మరోవైపు, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, ఆ ప్రచారాన్ని ఆమె ఖండిస్తూ మంత్రి సీతక్క బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక, ఆమె స్థానంలో ఆమ్రపాలి వస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలికి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. దాంతోపాటు మూసీ డెవలప్మెంట్ సంస్థ ఇన్చార్జ్ ఎండిగా కూడా అదనపు బాధ్యతలను కేటాయించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలులోని అగ్రహారం గ్రామానికి చెందిన ఆమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా ఆమ్రపాలి పనిచేశారు. కాగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ శైలజ రామయ్యర్ ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.

ఇదే సమయంలో హెచ్ఎండిఏ పరిధిలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ భూముల కోసం తప్పుడు రికార్డులు సృష్టించి కొందరు పొజిషన్ కోసం ప్రయత్నిస్తున్నారని దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ భూములన్నీ హెచ్ఎండిఏకే చెందుతాయని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on December 15, 2023 11:01 am

Share

Recent Posts

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

2 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

3 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

4 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

4 hours ago

కూతురి పెద్ద మాటలు… నాకు సంబంధం లేదన్న కొండా

సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…

7 hours ago

బాలయ్య చెప్పేదాకా నమ్మలేని విషయమది

నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…

8 hours ago