Political News

రేవంత్ టీంలోకి ఆమ్రపాలి..కీలక బాధ్యతలు

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కలిగిన సంగతి తెలిసిందే. జిహెచ్ఎంసి పరిధిలో ముగ్గురు కొత్త కమిషనర్లను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. మరోవైపు, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, ఆ ప్రచారాన్ని ఆమె ఖండిస్తూ మంత్రి సీతక్క బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక, ఆమె స్థానంలో ఆమ్రపాలి వస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలికి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. దాంతోపాటు మూసీ డెవలప్మెంట్ సంస్థ ఇన్చార్జ్ ఎండిగా కూడా అదనపు బాధ్యతలను కేటాయించింది. ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఆమ్రపాలి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలులోని అగ్రహారం గ్రామానికి చెందిన ఆమ్రపాలి 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో వికారాబాద్ సబ్ కలెక్టర్ గా, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ గా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ గా ఆమ్రపాలి పనిచేశారు. కాగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ శైలజ రామయ్యర్ ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.

ఇదే సమయంలో హెచ్ఎండిఏ పరిధిలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ భూముల కోసం తప్పుడు రికార్డులు సృష్టించి కొందరు పొజిషన్ కోసం ప్రయత్నిస్తున్నారని దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఆ భూములన్నీ హెచ్ఎండిఏకే చెందుతాయని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

This post was last modified on December 15, 2023 11:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

5 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

8 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago