Political News

టీడీపీతో పొత్తు వ్యవధిపై పవన్ కీలక వ్యాఖ్యలు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తగినంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీనీ వ్యతిరేకించే చాలామంది ముస్లింలు జనసేనను కూడా వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఎప్పటికీ ఓటు బ్యాంకులా చూడబోమని పవన్ క్లారిటీనిచ్చారు.

ముస్లింల అభివృద్ధి, అవసరాలకు అనుగుణంగా తమ విధివిధానాలు ఉంటాయని పవన్ చెప్పారు. రాబోయే ఎన్నికలలో జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని ముస్లింలకు పవన్ విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు అన్యాయం జరిగితే వారి వైపే నిలబడతానని, వారి పక్షాన గళం ఎత్తే నాయకుడిని తానే అవుతానని పవన్ భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీ చాలా నష్టపోయిందని, రాష్ట్రం బాగుపడాలంటే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. ఈ ఒక్కసారికి జనసేనను నమ్మాలని, ఒక్కసారి మాటిస్తే వెనక్కి వెళ్లనని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం జనసేన-టీడీపీ పొత్తు కనీసం 10 ఏళ్లయినా కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. మంగళగిరిలో మొహిద్దిన్ సాధిక్ అనే ముస్లిం నేత జనసేనలో చేరిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ కు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గా బన్నీ వాస్ ను పవన్ నియమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బన్నీ వాస్ కు నియామక పత్రాన్ని పవన్ స్వయంగా అందించారు. పార్టీకి ప్రచార విభాగం ఎంతో కీలకమని, సమన్వయంతో ఈ విభాగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని బన్నీ వాస్ కు పవన్ సూచించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వినూత్న కార్యక్రమాలు, ప్రచారం రూపొందించాలని కోరారు. పార్టీ ఎదుగుదల కోసం మరింతగా కష్టపడాలని, పార్టీ ఆశయాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. మెగా ఫ్యామిలీతో బన్నీ వాస్ కు సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే.

This post was last modified on December 15, 2023 10:53 am

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

5 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

5 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

5 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

6 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

6 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

8 hours ago