కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తగినంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీనీ వ్యతిరేకించే చాలామంది ముస్లింలు జనసేనను కూడా వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఎప్పటికీ ఓటు బ్యాంకులా చూడబోమని పవన్ క్లారిటీనిచ్చారు.
ముస్లింల అభివృద్ధి, అవసరాలకు అనుగుణంగా తమ విధివిధానాలు ఉంటాయని పవన్ చెప్పారు. రాబోయే ఎన్నికలలో జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని ముస్లింలకు పవన్ విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు అన్యాయం జరిగితే వారి వైపే నిలబడతానని, వారి పక్షాన గళం ఎత్తే నాయకుడిని తానే అవుతానని పవన్ భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీ చాలా నష్టపోయిందని, రాష్ట్రం బాగుపడాలంటే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. ఈ ఒక్కసారికి జనసేనను నమ్మాలని, ఒక్కసారి మాటిస్తే వెనక్కి వెళ్లనని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం జనసేన-టీడీపీ పొత్తు కనీసం 10 ఏళ్లయినా కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. మంగళగిరిలో మొహిద్దిన్ సాధిక్ అనే ముస్లిం నేత జనసేనలో చేరిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ కు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గా బన్నీ వాస్ ను పవన్ నియమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బన్నీ వాస్ కు నియామక పత్రాన్ని పవన్ స్వయంగా అందించారు. పార్టీకి ప్రచార విభాగం ఎంతో కీలకమని, సమన్వయంతో ఈ విభాగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని బన్నీ వాస్ కు పవన్ సూచించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వినూత్న కార్యక్రమాలు, ప్రచారం రూపొందించాలని కోరారు. పార్టీ ఎదుగుదల కోసం మరింతగా కష్టపడాలని, పార్టీ ఆశయాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. మెగా ఫ్యామిలీతో బన్నీ వాస్ కు సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 15, 2023 10:53 am
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…