కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తున్న జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తగినంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీనీ వ్యతిరేకించే చాలామంది ముస్లింలు జనసేనను కూడా వ్యతిరేకిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఎప్పటికీ ఓటు బ్యాంకులా చూడబోమని పవన్ క్లారిటీనిచ్చారు.
ముస్లింల అభివృద్ధి, అవసరాలకు అనుగుణంగా తమ విధివిధానాలు ఉంటాయని పవన్ చెప్పారు. రాబోయే ఎన్నికలలో జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని ముస్లింలకు పవన్ విజ్ఞప్తి చేశారు. ముస్లింలకు అన్యాయం జరిగితే వారి వైపే నిలబడతానని, వారి పక్షాన గళం ఎత్తే నాయకుడిని తానే అవుతానని పవన్ భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన ద్వారా ఏపీ చాలా నష్టపోయిందని, రాష్ట్రం బాగుపడాలంటే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. ఈ ఒక్కసారికి జనసేనను నమ్మాలని, ఒక్కసారి మాటిస్తే వెనక్కి వెళ్లనని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం జనసేన-టీడీపీ పొత్తు కనీసం 10 ఏళ్లయినా కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. మంగళగిరిలో మొహిద్దిన్ సాధిక్ అనే ముస్లిం నేత జనసేనలో చేరిన సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ కు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గా బన్నీ వాస్ ను పవన్ నియమించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బన్నీ వాస్ కు నియామక పత్రాన్ని పవన్ స్వయంగా అందించారు. పార్టీకి ప్రచార విభాగం ఎంతో కీలకమని, సమన్వయంతో ఈ విభాగాన్ని ముందుకు తీసుకువెళ్లాలని బన్నీ వాస్ కు పవన్ సూచించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం వినూత్న కార్యక్రమాలు, ప్రచారం రూపొందించాలని కోరారు. పార్టీ ఎదుగుదల కోసం మరింతగా కష్టపడాలని, పార్టీ ఆశయాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలని చెప్పారు. మెగా ఫ్యామిలీతో బన్నీ వాస్ కు సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 15, 2023 10:53 am
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…