ఏపీలో శాంతి భద్రతలు రోజురోజుకీ క్షీణించి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్కు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంగా దోపిడిదారులు, గుండాలు, మాఫియా శక్తులు ఏపీని ఆటవిక రాజ్యంగా మార్చాయని, ఏపీలో బడుగుబలహీన వర్గాల వారిపై దాడులు ఎక్కువయ్యాని ఆ లేఖలో చంద్రబాబు ఆరోపించారు. దీంతోపాటు, పుంగనూరులో జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై దాడి వ్యవహారం, పుంగనూరులో ఇటీవల ఇద్దరు దళిత యువకులు ఓం ప్రతాప్, ఎం. నారాయణలు అనుమానాస్పదంగా మరణించారని ఆరోపించారు. పుంగనూరులో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందనేందుకు ఈ దుర్ఘటనలే దుష్ట్యాంతాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు పోలీసులు సీఆర్పీసీ 91 నోటీసులు జారీ చేశారు. పుంగనూరు దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతికి సంబంధించిన సాక్ష్యాధారాలు సమర్పించాలని నోటీసులో మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఎస్డీపీవో) పేర్కొన్నారు.
ఓం ప్రతాప్ మృతిపై డీజీపీ సవాంగ్ కు చంద్రబాబు రాసిన లేఖ ఇపుడు చర్చనీయాంశమైంది. ఆ లేఖలో పేర్కొన్నట్లుగా ఓం ప్రతాప్ మృతికి సంబంధించి సాక్షాధారాలు సమర్పించాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆగస్ట్ 27న దినపత్రికల్లో వచ్చిన కథనాన్ని నోటీసులో పోలీసులు ప్రస్తావించారు. చంద్రబాబు దగ్గర ఉన్న సమాచారం, సాక్ష్యాధారాలను అందజేయాలని చంద్రబాబును మదనపల్లి ఎస్డీపీవో కోరారు. అంతేకాకుండా, నోటీసు అందిన వారం రోజుల లోపు, తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కాగా, ఇటీవల ఏపీలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని, ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఆధారాలుంటే సమర్పించాలంటూ చంద్రబాబును డీజీపీ సవాంగ్ కోరారు. ఇపుడు, తాజాగా మరోసారి అదే తరహాలో ఓం ప్రతాప్ మృతిపై ఆధారాలుంటే సమర్పించాలని కోరడం చర్చనీయాంశమైంది. మరి, ఈ తాజా లేఖపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on September 1, 2020 8:13 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…