Political News

తడిచిన పైరును పట్టుకోలేరా జగన్?: సీపీఐ రామకృష్ణ

మిచౌంగ్ తుపాను ధాటికి ఏపీలోని 15 జిల్లాల్లో 10 వేల కోట్ల రూపాయల విలువైన పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, తుపాను వల్ల వరి పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జగన్ వెళ్లిన తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. రోడ్డు మీద టెంటు వేసుకొని…ఆ పక్కన బారికేడ్లు పెట్టుకొని రైతులను దూరంగా ఉంచిన వైనంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్రెడీ 440 మండలాల్లో కరవు ఉందని, దానికి తోడు మిచౌంగ్ తుపాను విలయ తాండవం చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని నిప్పులు చెరిగా. రైతాంగం పూర్తిగా నష్టపోయినా…పట్టించుకోని సీఎంకు సిగ్గుందా అని ప్రశ్నించారు.

మిచౌంగ్ తుపాన్ వల్ల రైతాంగం పూర్తిగా నష్టపోయిందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎన్నికలకు ముందు జగన్ అందరి తలపై చేయి వేసి తిరిగావు.. ఇప్పుడు పొలాల్లో దిగకుండా షో చేస్తున్నావు..” అని ఎద్దేవా చేశారు. “ఓట్లు కోసం ఎత్తులు వేశావు… అన్నివర్గాల ప్రజలను, రైతులను చిత్తు చేశావు” అని చురకలంటించారు. కరువు, తుఫాన్ ప్రాంత రైతుల పిల్లలకు ఫీజు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్, ఆయన మంత్రులు క్షేత్ర స్థాయిలో పొలాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బృందాలను కలిసి నష్టం వివరాలను అందచేస్తామని, ఢిల్లీ స్థాయిలో అందరినీ కలుపుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తామని రామకృష్ణ అన్నారు. జగన్ పొలాల్లో దిగకుండా…తడిచిన వరి పైరును పట్టుకోవడానికి కూడా ఇష్టపడకపోవడంతో రామకృష్ణ ఈ కామెంట్లు చేశారు.

Satya

Recent Posts

పాలన… ప్లానింగ్… బాగున్నాయి లోకేష్

పాల‌న విష‌యంలో మంత్రి లోకేష్ ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయాల‌ను విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌ల‌గాపుల‌గం…

2 hours ago

ఇక RCB అభిమానులను ఎవరు ఆపలేరు

పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…

4 hours ago

గ్రేటర్ హైద‌రాబాద్ ఎల‌క్ష‌న్స్‌… ప్లాన్ ఏంటి సీఎం సార్?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే పాల‌క మండ‌లి కూడా ర‌ద్ద‌యింది. ప్ర‌త్యేక అధికారి పాల‌న‌లోకి…

4 hours ago

అనుపమలో కొత్త కోణం బయటికొచ్చిందే

ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…

5 hours ago

సోష‌ల్ ఉద్య‌మం: ఏపీలో తెలంగాణ విగ్ర‌హాలు|

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ సృష్టించిన ప్ర‌భంజ‌నం అంద‌రికీ తెలిసిందే. బొద్దింక‌ల పార్టీగా ప్రారంభ‌మై.. ఒక వైపు…

5 hours ago

రీప్లేస్‌మెంట్‌గా వచ్చి.. ఆర్సీబీ తలరాతనే మార్చాడు

మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…

6 hours ago