విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు ఫైర్ బ్రాండ్ కేశినేని నాని వ్యవహారం సైలెంట్గానే ఉన్నప్పటికీ.. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియనే రీతిలో ఉందని టీడీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ఆయన పార్టీలోనే ఉన్నా.. అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం.. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి రెండు స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతుండడమేనని చెబుతున్నారు.
కానీ, వచ్చే ఎన్నికల్లో కుటుంబానికి ఒకే సీటు, అది కూడా గెలుపు గుర్రాలకు మాత్రమే కేటాయిస్తానని చంద్రబాబు పదే పదే తేల్చేస్తున్నారు. కానీ, తన కుమార్తె, ప్రస్తుతం విజయవాడ 11 వ డివిజన్ కార్పొరేట ర్గా ఉన్న కేశినేని శేతకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలన్నది కేశినేని వ్యూహం. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆయన పశ్చిమ టికెట్ను తన కుమార్తెకు ఇవ్వాలని కోరారు.
కానీ, విజయవాడ కార్పొరేషన్ గెలిపించుకుంటే మేయర్ పీఠాన్ని ఇస్తామని.. చంద్రబాబు ఇచ్చిన హామీతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే, కార్పొరేషన్ ఎన్నికల్లో శ్వేత గెలిచినా.. పార్టీ ఓడిపోయింది. దీంతో ఆ హామీ అమలు కాలేదు. ఇక, ఇప్పుడు ఉపేక్షించి లాభం లేదని భావిస్తున్న నాని.. తనకు, తన కుమార్తెకు టికెట్ల కోసం ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ లేదా.. మైలవరం టికెట్లను ఆయన ఆశిస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది.
మైలవరం నుంచి ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమకు, ఎంపీనానికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ టికెట్ను తీసుకుంటే.. ఉభయ కుశలోపరిగా పనిచక్కబెట్టుకోవచ్చని ఆయన వ్యూహంగా ఉంది. దీనికి చంద్రబాబు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలోచనలో పెట్టారు. మరోవైపు.. వైసీపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక్కడ కూడా. ఇదే షరతుతో ఎంపీ ఉన్నారని..రెండు టికెట్లు ఆశిస్తున్నారని చెబుతున్నారు. అయితే, మైలవరానికి బదులు విజయవాడ పశ్చిమ లేదా తూర్పు కావాలని కోరుతున్నారట. దీంతో ఇక్కడ కూడా ఎటూ తేలకుండా పోయింది. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 14, 2023 1:46 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…