విజయవాడ ఎంపీ, టీడీపీ నాయకుడు ఫైర్ బ్రాండ్ కేశినేని నాని వ్యవహారం సైలెంట్గానే ఉన్నప్పటికీ.. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో తెలియనే రీతిలో ఉందని టీడీపీ నాయకులు గుసగుసలాడుతున్నారు. ఆయన పార్టీలోనే ఉన్నా.. అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం.. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబానికి రెండు స్థానాలు ఇవ్వాలని పట్టుబడుతుండడమేనని చెబుతున్నారు.
కానీ, వచ్చే ఎన్నికల్లో కుటుంబానికి ఒకే సీటు, అది కూడా గెలుపు గుర్రాలకు మాత్రమే కేటాయిస్తానని చంద్రబాబు పదే పదే తేల్చేస్తున్నారు. కానీ, తన కుమార్తె, ప్రస్తుతం విజయవాడ 11 వ డివిజన్ కార్పొరేట ర్గా ఉన్న కేశినేని శేతకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకోవాలన్నది కేశినేని వ్యూహం. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆయన పశ్చిమ టికెట్ను తన కుమార్తెకు ఇవ్వాలని కోరారు.
కానీ, విజయవాడ కార్పొరేషన్ గెలిపించుకుంటే మేయర్ పీఠాన్ని ఇస్తామని.. చంద్రబాబు ఇచ్చిన హామీతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే, కార్పొరేషన్ ఎన్నికల్లో శ్వేత గెలిచినా.. పార్టీ ఓడిపోయింది. దీంతో ఆ హామీ అమలు కాలేదు. ఇక, ఇప్పుడు ఉపేక్షించి లాభం లేదని భావిస్తున్న నాని.. తనకు, తన కుమార్తెకు టికెట్ల కోసం ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ పశ్చిమ లేదా.. మైలవరం టికెట్లను ఆయన ఆశిస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది.
మైలవరం నుంచి ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమకు, ఎంపీనానికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ టికెట్ను తీసుకుంటే.. ఉభయ కుశలోపరిగా పనిచక్కబెట్టుకోవచ్చని ఆయన వ్యూహంగా ఉంది. దీనికి చంద్రబాబు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలోచనలో పెట్టారు. మరోవైపు.. వైసీపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక్కడ కూడా. ఇదే షరతుతో ఎంపీ ఉన్నారని..రెండు టికెట్లు ఆశిస్తున్నారని చెబుతున్నారు. అయితే, మైలవరానికి బదులు విజయవాడ పశ్చిమ లేదా తూర్పు కావాలని కోరుతున్నారట. దీంతో ఇక్కడ కూడా ఎటూ తేలకుండా పోయింది. మరి ఎన్నికల సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 14, 2023 1:46 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…