Political News

తెలంగాణ : లోక్ సభ ఎంపీ సీట్లు మెజారిటీ ఎవరికంటే…

ఇపుడు అందరి కళ్ళు రాబోయే పార్లమెంటు ఎన్నికలపైనే పడింది. మరో నాలుగు మాసాల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మొన్నటి అసెంబ్లీ ఫలితాలే పునరావృతమవుతుందా లేకపోతే మారిపోతాయా అన్న చర్చలే జరుగుతున్నాయి. ఈ సమయంలోనే టౌమ్స్ నౌ ఈటీజీ ఒక సర్వే జోస్యాన్ని విడుదలచేసింది. దాని ప్రకారం ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే అన్న ప్రాతిపదికన సర్వే నిర్వహించినట్లు చెప్పింది. లేటెస్ట్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కంఫర్టబుల్ రిజల్టుతో ఉన్నట్లు తేలింది.

విషయం ఏమిటంటే కాంగ్రెస్ కు 8-10 సీట్ల మధ్య గెలుపు ఖాయమని తేల్చింది. ఇక బీఆర్ఎస్, బీజేపీలకు చెరి మూడు సీట్లు గెలుచుకునే అవకాశాలున్నట్లు తేల్చింది. ఎంఐఎంకు ఒక సీటు గ్యారెంటీ అని చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ సరళి, ఆయా పార్టీలకు వచ్చిన ఓటింగ్ శాతాలు, ప్రజల్లో అభిప్రాయాలు తదితరాలను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహించినట్లుగా టైమ్స్ నౌ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లను గెలుచుకుంది.

బీఆర్ఎస్ 9 నియోజకవర్గాలను, బీజేపీ నాలుగు చోట్ల గెలిచింది. హైదరాబాద్ లోక్ సభలో ఎంఐఎం గెలిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు పోటీచేసి గెలవటంతో ఎంపీలుగా రాజీనామాలు చేశారు. కాబట్టి ఇపుడు కాంగ్రెస్ సంఖ్య జీరో అనే చెప్పాలి. అయితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 8 నుండి పది సీట్లలో గెలుస్తుందని తేలటం అంటే మంచి ఫిగర్ అనే చెప్పాలి. అయితే ఎన్నికలకు ఇంకా నాలుగు మాసాలుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఆ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీల్లో ఇప్పటికే రెండింటిని అమల్లోకి తెచ్చారు రేవంత్. మిగిలిన ఆరింటిని కూడా అమల్లోకి తెచ్చేస్తే జనాల్లో సానుకూలత రావటం ఖాయమనే అనిపిస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ గెలుచుకోబోయే నియోజకవర్గాలు సర్వేలో తేలిందానికన్నా ఇంకా ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on December 14, 2023 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీతా 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

34 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

2 hours ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

3 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago