ఉద్ధానం…ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పేషెంట్లు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులను కిడ్నీ సమస్యలను వేధిస్తున్నాయి. ఈ మహమ్మారి వ్యాధిబారిన పడి వందలాదిమంది మృత్యువాత పడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఉద్ధానం బాధితులకు మాత్రం ఊరట లభించలేదు. గతంలో పలు ప్రభుత్వాలు ఆసుపత్రి నిర్మిస్తామని హామీలిచ్చినా…వాటిని మాత్రం నెరవేర్చలేదు. అయితే, ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో జగన్ ఉద్ధానం బాధితుల కష్టాలను స్వయంగా చూశారు. తాను అధికారంలోకి వస్తే ఉద్ధానం బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
ఈ క్రమంలోనే అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఉద్దానం బాధితులకు అండగా నిలబడ్డారు. పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 50 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం నిర్మించింది. “డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్’ అంటూ ఉద్ధానం ప్రజల జీవితాలలో జగన్ వెలుగులు నింపారు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధికి మూల కారణాలపై పరిశోధన చేసి నివేదిక సిద్దమైంది. రోగం వచ్చాక ట్రీట్ మెంట్ చేయడం కంటే…రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్దం చేశారు.
పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 700 కోట్ల రూపాయలతో నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం అందించారు. జగన్. ఉద్దానం ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుమారు 700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయనున్నారు. ఈ నెల 14న సీఎం జగన్ చేతుల మీదుగా ఈ రెండు ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. తమ బతుకుపై ఆశ కలిగించిన జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు.
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…
పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…
గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్…
టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…
చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…