Political News

ఉద్ధానం కిడ్నీ బాధితులకు జగన్ ఊరట

ఉద్ధానం…ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పేషెంట్లు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతవాసులను కిడ్నీ సమస్యలను వేధిస్తున్నాయి. ఈ మహమ్మారి వ్యాధిబారిన పడి వందలాదిమంది మృత్యువాత పడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా ఉద్ధానం బాధితులకు మాత్రం ఊరట లభించలేదు. గతంలో పలు ప్రభుత్వాలు ఆసుపత్రి నిర్మిస్తామని హామీలిచ్చినా…వాటిని మాత్రం నెరవేర్చలేదు. అయితే, ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో జగన్ ఉద్ధానం బాధితుల కష్టాలను స్వయంగా చూశారు. తాను అధికారంలోకి వస్తే ఉద్ధానం బాధితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.

ఈ క్రమంలోనే అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఉద్దానం బాధితులకు అండగా నిలబడ్డారు. పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 50 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం నిర్మించింది. “డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌’ అంటూ ఉద్ధానం ప్రజల జీవితాలలో జగన్ వెలుగులు నింపారు. ఉద్ధానంలో కిడ్నీ వ్యాధికి మూల కారణాలపై పరిశోధన చేసి నివేదిక సిద్దమైంది. రోగం వచ్చాక ట్రీట్ మెంట్ చేయడం కంటే…రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్దం చేశారు.

పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 700 కోట్ల రూపాయలతో నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం అందించారు. జగన్. ఉద్దానం ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుమారు 700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీరు అందించనున్నారు. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయనున్నారు. ఈ నెల 14న సీఎం జగన్ చేతుల మీదుగా ఈ రెండు ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. తమ బతుకుపై ఆశ కలిగించిన జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు.

This post was last modified on December 13, 2023 9:54 pm

Share

Recent Posts

ఎఫెక్ట్ పడింది… ఐఫోన్ 18 ప్రో ధర పెరిగింది

ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో…

40 minutes ago

బేబీ జంటకు ‘ఎపిక్’ ఎగ్జామ్

రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ…

50 minutes ago

అంత గొప్ప పాట‌ను దేవి 8 ఏళ్ల‌కే…

కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో ఆడ‌క‌పోయినా.. కొన్ని పాట‌లు, స‌న్నివేశాలు క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకుంటాయి. వ‌ర్షం…

1 hour ago

న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. బాబు చేసిన‌ట్టు చేయొచ్చుగా జ‌గ‌న్‌!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంపై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఎన్నిక‌ల నిర్వహ‌ణ…

3 hours ago

కసబ్ కు వాళ్లకు తేడా లేదు

స్పీకర్ ను అవమానించిన వాళ్లకు ముంబైలో దాడులకు పాల్పడిన కసబ్ కు పెద్దగా తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి రేవంత్…

3 hours ago

అది నిజ‌మైతే.. వైసీపీ ఖాళీ అవుతుందా?

వైసీపీ ఖాళీ అవుతుంది.. ఈ మాట‌లు తరచుగా వినిపిస్తున్నాయి. అయితే.. పోయే వారిని పోనీ.. అన్న‌ట్టుగానే పార్టీ అధినేత జ‌గ‌న్…

8 hours ago