టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించారు. దాదాపు మూడు మాసాలకుపైగా గ్యాప్తో ఆయన ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబు దృష్టి పెట్టారు. వైసీపీ దూకుడు, ఇక్కడ కార్యకర్తలపై కేసులు.. ముఖ్యంగా మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ఆగడాలు వంటివాటిపై ఆయన చర్చించారు.
ప్రస్తుతం ఇక్కడ చంద్రబాబు నివాసం నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై కూడా ఆయన సమీక్షించారు. నిర్మాణ పనులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నించారు. వచ్చే సంక్రాంతి తర్వాత.. దానిని ప్రారంభించేందుకు రెడీ చేయాలని సూచించారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే తాను పోటీచేస్తున్నానని.. గతంలో మాదిరిగా కాకుండా.. వైసీపీకి బుద్ధి చెప్పేలా.. లక్ష మెజారిటీ సాధించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆ దిశగా నాయకులు క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు.
కుప్పంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్ని అధినేతకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వివరించారు. అడుగడుగునా.. కార్యకర్తలను వైసీపీ నాయకులు వేధిస్తున్నారని తెలిపారు. అయినా.. వాటిని దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరింత దీటుగా పనిచేస్తామని శ్రీకాంత్ వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ., కుప్పంలో లక్ష మెజార్టీ దిశగా పని చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
This post was last modified on January 6, 2024 5:49 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…