గడ్డం బ్రదర్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న గడ్డం వివేక్, గడ్డం వినోద్ల పరిస్థితి అంతర్మథనంలో పడింది. బీజేపీ నుంచి నామినేషన్ల ఘట్టానికి చివరి నిముషంలో కాంగ్రెస్లోకి వచ్చిన గడ్డం వివేక్.. చెన్నూరు నుంచి విజయం దక్కించుకున్నారు. ఇక, కాంగ్రెస్లోనే ఉన్న గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. వీరికి సుదీర్ఘ రాజకీయ ప్రస్తానం ఉన్న విషయం తెలిసిందే.
అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీల కోటాలో తమకు మంత్రిపదవులు దక్కుతాయని బ్రదర్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ, వారి విషయాన్ని ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు జాతీయ నాయకత్వం కూడా పక్కన పెట్టాయి. దీంతో ఇద్దరు బ్రదర్స్ కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న తమకు న్యాయం చేయాలని పార్టీ అదిష్టానాన్ని ఇద్దరూ వేడుకుంటున్నారు.
అయితే.. వినోద్కు మాత్రం అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చినట్టు కాంగ్రెస్లో ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లి నుంచి విజయం సాధించిన వినోద్.. కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గంలో మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. వివేక్ పార్టీలు మారుతారనే పేరు తెచ్చుకున్నా వినోద్ మాత్రం తన పని తను చేసుకుని పోయారు. ఇక, అధిష్టానంతోనూ కలివిడిగానే ఉన్నారు.
కానీ, తెలంగాణ విషయంలో రాక రాక అధికారం దక్కిన నేపథ్యంలో నేరుగా జోక్యం చేసుకునేందుకు అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. దీంతో గడ్డం బ్రదర్స్కు ఇబ్బందిగా ఉందనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర స్థాయిలో నాయకులతో వీరికి పెద్దగా చనువు లేకపోవడం, కేవలం వెంకటస్వామి కుమారులుగానే పేరు ఉండడంతో మంత్రి వర్గంలో వీరికి తొలి ఛాన్స్ దక్కలేదు. ఇక, మరో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వినోద్ తనను తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 13, 2023 9:05 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…