“కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి.. ఆరు మాసాల వరకు వేచి చూస్తాం. మౌనంగా అన్నింటినీ పరిశీలి స్తాం” అని చెప్పిన బీఆర్ ఎస్ పార్టీ నేతలు.. ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే విమర్శలకు పదును పెంచేశారు. అప్పుడే సీఎం రేవంత్ను టార్గెట్ చేయడం ప్రారంభించేశారు. రేవంత్ ఇచ్చిన హామీలు అలివిగానివని తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో రేవంత్ చెప్పిన ప్రతీ మాటకు రికార్డ్ ఉందని, ఎట్టి పరిస్థితిలోనూ రేవంత్ను వదిలి పెట్టేపరిస్థితి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని.. రాగానే పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారని.. పదిరోజులు ఆగండి 15వేలు రైతు భరోసా ఇస్తాం అన్నారని.. కాని ఇంకా ఇవ్వలేదని విమర్శించారు.
“మొదటి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తామన్నారు ఏమైంది” అని మాజీ మంత్రి నిలదీశారు. రైతులకు రుణ మాఫీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో తమకు తెలుసని గతాన్ని తవ్వుకొచ్చారు. ఇప్పుడు ఇదే హామీని ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు ఎలా చేస్తారో తాము కూడా చూస్తామని సవాల్ విసిరారు.
ఎవరైనా అధికారంలోకి రాక ముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని.. కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు చూసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. వారు చూసుకోక పోతే తమకేం సంబంధమని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్ల అప్పుల్లో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆరు మాసాలు ఆగుతామని చెప్పిన కేటీఆర్.. అనూహ్యంగా విమర్శలు పెంచడం గమనార్హం.
This post was last modified on December 13, 2023 3:17 pm
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…