“కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి.. ఆరు మాసాల వరకు వేచి చూస్తాం. మౌనంగా అన్నింటినీ పరిశీలి స్తాం” అని చెప్పిన బీఆర్ ఎస్ పార్టీ నేతలు.. ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే విమర్శలకు పదును పెంచేశారు. అప్పుడే సీఎం రేవంత్ను టార్గెట్ చేయడం ప్రారంభించేశారు. రేవంత్ ఇచ్చిన హామీలు అలివిగానివని తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో రేవంత్ చెప్పిన ప్రతీ మాటకు రికార్డ్ ఉందని, ఎట్టి పరిస్థితిలోనూ రేవంత్ను వదిలి పెట్టేపరిస్థితి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని.. రాగానే పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారని.. పదిరోజులు ఆగండి 15వేలు రైతు భరోసా ఇస్తాం అన్నారని.. కాని ఇంకా ఇవ్వలేదని విమర్శించారు.
“మొదటి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తామన్నారు ఏమైంది” అని మాజీ మంత్రి నిలదీశారు. రైతులకు రుణ మాఫీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో తమకు తెలుసని గతాన్ని తవ్వుకొచ్చారు. ఇప్పుడు ఇదే హామీని ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు ఎలా చేస్తారో తాము కూడా చూస్తామని సవాల్ విసిరారు.
ఎవరైనా అధికారంలోకి రాక ముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని.. కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు చూసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. వారు చూసుకోక పోతే తమకేం సంబంధమని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్ల అప్పుల్లో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆరు మాసాలు ఆగుతామని చెప్పిన కేటీఆర్.. అనూహ్యంగా విమర్శలు పెంచడం గమనార్హం.
This post was last modified on December 13, 2023 3:17 pm
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…