“కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి.. ఆరు మాసాల వరకు వేచి చూస్తాం. మౌనంగా అన్నింటినీ పరిశీలి స్తాం” అని చెప్పిన బీఆర్ ఎస్ పార్టీ నేతలు.. ప్రభుత్వం ఏర్పడి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే విమర్శలకు పదును పెంచేశారు. అప్పుడే సీఎం రేవంత్ను టార్గెట్ చేయడం ప్రారంభించేశారు. రేవంత్ ఇచ్చిన హామీలు అలివిగానివని తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో రేవంత్ చెప్పిన ప్రతీ మాటకు రికార్డ్ ఉందని, ఎట్టి పరిస్థితిలోనూ రేవంత్ను వదిలి పెట్టేపరిస్థితి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని.. రాగానే పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారని.. పదిరోజులు ఆగండి 15వేలు రైతు భరోసా ఇస్తాం అన్నారని.. కాని ఇంకా ఇవ్వలేదని విమర్శించారు.
“మొదటి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్ట బద్దత కల్పిస్తామన్నారు ఏమైంది” అని మాజీ మంత్రి నిలదీశారు. రైతులకు రుణ మాఫీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో తమకు తెలుసని గతాన్ని తవ్వుకొచ్చారు. ఇప్పుడు ఇదే హామీని ఇచ్చిన కాంగ్రెస్ పాలకులు ఎలా చేస్తారో తాము కూడా చూస్తామని సవాల్ విసిరారు.
ఎవరైనా అధికారంలోకి రాక ముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారని.. కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు చూసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. తాము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉందన్నారు. వారు చూసుకోక పోతే తమకేం సంబంధమని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, పౌర సరఫరాల శాఖ 56 వేల కోట్ల అప్పుల్లో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక, ఇప్పుడు ఆరు మాసాలు ఆగుతామని చెప్పిన కేటీఆర్.. అనూహ్యంగా విమర్శలు పెంచడం గమనార్హం.
This post was last modified on December 13, 2023 3:17 pm
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…
హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…