Political News

జగన్ రెండో జాబితాను సిద్ధం చేస్తున్నారా ?

మొదటిజాబితాలో 11 మంది ఎంఎల్ఏలు, మంత్రులకు స్ధానచలనం కలిగించిన జగన్మోహన్ రెడ్డి రెండో జాబితాను కూడా సిద్ధం చేస్తున్నారట. రెండో జాబితాలో మంత్రులు, ఎంఎల్ఏలు కలిసి 45 మంది దాకా ఉంటారని పార్టీవర్గాల సమాచారం. రెండో జాబితాలో రాయలసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుండి కొత్త నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు. మరి కొత్త నియోజకవర్గాల నుండే పోటీచేయిస్తారా లేకపోతే పూర్తిగా పక్కకు తప్పిస్తారా అన్నది సస్పెన్సుగా మారింది.

నియోజకవర్గాలు మార్పన్నది మంత్రులు, ఎంఎల్ఏల పనితీరు ఆధారంగానే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో కూడా రెండు రకాలున్నాయి. మొదటిదేమో 2019లో గెలిచిన నియోజకవర్గాల్లో జనాల్లో వ్యతిరేకత కనబడుతుండటం. రెండో కారణం ఏమిటంటే మార్చిన నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేయించటమే. ఇదే సమయంలో ద్వితీయ శ్రేణి నేతలు, క్యాడర్ కు కూడా కొత్త ఇన్చార్జిలతో ఫ్రెష్ లుక్ కనబడుతుందని జగన్ అనుకుంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధినేతలు ఏవేవో అంచనాలు వేసుకుని నియోజకవర్గాల్లో మార్పులు చేస్తుంటారు. అలాంటి మార్పుల్లో కొన్నిచోట్ల ఆశించిన పలితాలు రావచ్చు మరికొన్ని చోట్ల ఆశాభంగం ఎదురవచ్చు. కాకపోతే తాము గెలిచిన నియోజకవర్గాల్లో జనాల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలు, మంత్రులు కొత్త నియోజకవర్గాల్లో మాత్రం జనామోదం ఎలా పొందుతారన్నది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలన్నింటికీ రాబోయే ఎన్నికల్లో మాత్రమే సమాధానం దొరుకుతుంది.

మార్పులన్నది అన్నీ పార్టీల్లోను సహజంగా జరిగేదే. కాస్త అటు ఇటుగా తెలుగుదేశంపార్టీలో కూడా అధినేత చంద్రబాబు చేస్తున్నారు. సరిగా పనిచేయని నేతల స్ధానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకమిటీల పేరుతో ఇద్దరు, ముగ్గురు నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్న విషయం చూస్తున్నదే. ఇపుడు చంద్రబాబు చేస్తున్నమార్పులన్నీ నూరుశాతం ఫలితాలిస్తాయని ఎవరూ గ్యారెంటీగా చెప్పలేరు. ఈ పద్దతిలోనే పార్టీలో మార్పులకు జగన్ శ్రీకారంచుట్టింది. మరీ మార్పుల ప్రభావం ఎలాగుంటుందో చూడాల్సిందే.

This post was last modified on December 13, 2023 12:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

23 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

36 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

1 hour ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago