Political News

బీఆర్ఎస్ తో కటీఫ్ అయిపోయిందా ?

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో ఎంఐఎం పార్టీ కటీఫ్ చెప్పేసినట్లేనా. తాజా పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తోంది. ఎంఎల్ఏల ప్రమాణస్వీకారం విషయంలో ఎంఐఎం శాసనసభా పక్షం నేత అక్బరుద్దీన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రోటెం స్పీకర్ గా నియమించింది. ఈ నియామకమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం ఏమిటంటే బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలుగా ఉండటమే. పార్టీలోనే సీనియర్ ఎంఎల్ఏని కాదని అక్బరుద్దీన్ను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయటం వెనుక రేవంత్ వ్యూహాత్మక ఎత్తుగడుందని అందరికీ అర్ధమైపోయింది.

దీనికి అదనంగా తాజాగా ఎంఐఎం ఎంఎల్ఏలందరితో రేవంత్ భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి మద్దతివ్వమని రేవంత్ ఎంఐఎం ఎంఎల్ఏలను రిక్వెస్టుచేసినట్లు సమాచారం. అవసరమైపుడు మద్దతిస్తామని అక్బరుద్దీన్ కూడా మాటిచ్చినట్లు ప్రచారం మొదలైంది. తాజా పరిణామాలతో పదేళ్ళ బీఆర్ఎస్ తో దీస్తీకి ఎంఐఎం ఫులిస్టాప్ పెట్టేసినట్లయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటాలి.

ఇపుడు కాంగ్రెస్ కు ఉన్నది కేవలం 64 సీట్లు మాత్రమే. అంటే మ్యాజిక్ ఫిగర్ కు అదనంగా 4 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నది. పరిస్ధితులను గమనిస్తే ఇదేమంత సేఫ్ ప్రభుత్వం కాదనే చెప్పాలి. అందుకనే కాంగ్రెస్ బలాన్ని వీలైనంత తొందరలో వీలైనంతగా పెంచుకోవాలన్నది రేవంత్ ఆలోచనగా కనబడుతోంది. అందుకనే ముందు ఎంఐఎం ఎంఎల్ఏలతో భేటీ అయ్యారు. వీళ్ళు గనుక మిత్రపక్షంగా మారితే కాంగ్రెస్+మిత్రపక్షం బలం 71కి పెరుగుతుంది.

అప్పుడు రేవంత్ కు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుండి ఎంఎల్ఏలు ఎవరైనా మద్దతు ఇవ్వటానికి సిద్ధపడితే కాంగ్రెస్ బలం మరింతగా పెరుగుతుంది. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు కేసీయార్ పార్టీ బలాన్ని పెంచుకున్నది ఇలాగే అని అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎం మాత్రం సేఫ్ జోన్లోనే ఉంటోంది. ఎందుకంటే తన ఏడుసీట్లను కాపాడుకుంటుండటమే ఎంఐఎంకి రక్షణకి ఢోకా లేకుండా పోతోంది.

This post was last modified on December 13, 2023 11:20 am

Share
Show comments
Published by
satya

Recent Posts

బాలయ్య బ్యాక్ టు డ్యూటీ

ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…

55 mins ago

పూజా హెగ్డే కోరుకున్న బ్రేక్ దొరికింది

మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…

3 hours ago

ఆమంచి .. ఎవరి ‘కొంప’ ముంచేనో ?!

ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…

3 hours ago

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

3 hours ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

3 hours ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

4 hours ago