Political News

బీఆర్ఎస్ తో కటీఫ్ అయిపోయిందా ?

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో ఎంఐఎం పార్టీ కటీఫ్ చెప్పేసినట్లేనా. తాజా పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తోంది. ఎంఎల్ఏల ప్రమాణస్వీకారం విషయంలో ఎంఐఎం శాసనసభా పక్షం నేత అక్బరుద్దీన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రోటెం స్పీకర్ గా నియమించింది. ఈ నియామకమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం ఏమిటంటే బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రపక్షాలుగా ఉండటమే. పార్టీలోనే సీనియర్ ఎంఎల్ఏని కాదని అక్బరుద్దీన్ను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేయటం వెనుక రేవంత్ వ్యూహాత్మక ఎత్తుగడుందని అందరికీ అర్ధమైపోయింది.

దీనికి అదనంగా తాజాగా ఎంఐఎం ఎంఎల్ఏలందరితో రేవంత్ భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి మద్దతివ్వమని రేవంత్ ఎంఐఎం ఎంఎల్ఏలను రిక్వెస్టుచేసినట్లు సమాచారం. అవసరమైపుడు మద్దతిస్తామని అక్బరుద్దీన్ కూడా మాటిచ్చినట్లు ప్రచారం మొదలైంది. తాజా పరిణామాలతో పదేళ్ళ బీఆర్ఎస్ తో దీస్తీకి ఎంఐఎం ఫులిస్టాప్ పెట్టేసినట్లయ్యింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ను దాటాలి.

ఇపుడు కాంగ్రెస్ కు ఉన్నది కేవలం 64 సీట్లు మాత్రమే. అంటే మ్యాజిక్ ఫిగర్ కు అదనంగా 4 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నది. పరిస్ధితులను గమనిస్తే ఇదేమంత సేఫ్ ప్రభుత్వం కాదనే చెప్పాలి. అందుకనే కాంగ్రెస్ బలాన్ని వీలైనంత తొందరలో వీలైనంతగా పెంచుకోవాలన్నది రేవంత్ ఆలోచనగా కనబడుతోంది. అందుకనే ముందు ఎంఐఎం ఎంఎల్ఏలతో భేటీ అయ్యారు. వీళ్ళు గనుక మిత్రపక్షంగా మారితే కాంగ్రెస్+మిత్రపక్షం బలం 71కి పెరుగుతుంది.

అప్పుడు రేవంత్ కు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుండి ఎంఎల్ఏలు ఎవరైనా మద్దతు ఇవ్వటానికి సిద్ధపడితే కాంగ్రెస్ బలం మరింతగా పెరుగుతుంది. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు కేసీయార్ పార్టీ బలాన్ని పెంచుకున్నది ఇలాగే అని అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎంఐఎం మాత్రం సేఫ్ జోన్లోనే ఉంటోంది. ఎందుకంటే తన ఏడుసీట్లను కాపాడుకుంటుండటమే ఎంఐఎంకి రక్షణకి ఢోకా లేకుండా పోతోంది.

This post was last modified on December 13, 2023 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

1 hour ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

6 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

6 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago