Political News

ఈ సీట్లో టీడీపీ జెండా ఎగురుతుందా ?

ఇపుడిదే చర్చ పార్టీలో బాగా పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే కడప పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబునాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే అది సాధ్యమేనా అనే చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే పార్టీ పెట్టినదగ్గర నుండి టీడీపీ 1984లో తప్ప ఇంకే ఎన్నికలోను గెలవలేదు. మొదట్లో కమ్యూనిస్టు అభ్యర్ధి వై ఈశ్వరరెడ్డి నాలుగు సార్లు గెలిచారు. తర్వాత కాంగ్రెస్ మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు వీ రామిరెడ్డి, కందుల ఓబుల్ రెడ్డి గెలిచారు.

మధ్యలో 1984లో టీడీపీ అభ్యర్ధిగా డీఎన్ రెడ్డి గెలిచారు. తర్వాత నుండి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాలుగుసార్లు, ఆ తర్వాత సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి రెండుసార్లు, ఆ తర్వాత రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గెలిచారు. గడచిన రెండు ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డే గెలిచారు. దాంతో కడప లోక్ సభ అంటేనే వైఎస్ ఫ్యామిలీ సొంతమన్నట్లుగా అయిపోయింది. అలాంటి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే టీడీపీని గెలిపించుకోవాలన్నది చంద్రబాబు పట్టుదల.

ఇపుడు కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డినే వచ్చే ఎన్నికల్లో పోటీచేయించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆయన భార్య మాధవీరెడ్డిని కడప అసెంబ్లీకి పోటీచేయించబోతున్నారనే ప్రచారం బాగా ఊపందుకుంది. ఇదే సమయంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఎవరిని పోటీచేయిస్తారనే విషయం ఫైనల్ కాలేదు. అసెంబ్లీకి ఎవరు పోటీచేస్తారనేదానిపైన పార్లమెంటు అభ్యర్ధి గెలుపు ఆధారపడుంటుంది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై ఆరోపణలు, ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందని, వైసీపీలో కుమ్ములాటలు పెరిగిపోతున్న కారణంగా పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు కలిసొచ్చే అంశాలని తమ్ముళ్ళు ఆశాభావంతో ఉన్నారు. అయితే వైసీపీని తక్కువ అంచనా వేసేందుకు లేదు. ఎందుకంటే కడప అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోటని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాగే అవినాష్ కూడా బాగా జనాల్లో చొచ్చుకుపోయారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని నేతలు, క్యాడర్ తో పాటు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధే తనను గెలిపిస్తాయని అవినాష్ అనుకుంటున్నారు. మరి చివరకు ఏమి జరగుతుందో చూడాలి.

This post was last modified on December 12, 2023 5:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చావు భయంలో ఎలన్ మస్క్

ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…

3 minutes ago

కార్యకర్తలతో చంద్రబాబు… కాఫీ కబుర్లు

తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.   'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…

54 minutes ago

ప్రశ్నార్థకంగా మారుతున్న రామ్ సెలక్షన్

ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…

1 hour ago

సెన్సారుకి సారీ… మంచి సాంప్రదాయం

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… జీతాలు తగ్గుతాయా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…

3 hours ago

కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…

4 hours ago