తెలంగాణలో అధికారం దక్కించుకోవాలన్న కలలను సాకారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. సుదీర్ఘ విరామం తర్వాత.. సక్సెస్ అయింది. తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక, వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ప్రధాన సమస్యలను ఆలంబనగా చేసుకుని ఏపీలో చక్రం తిప్పేందుకు.. కాంగ్రెస్ అగ్రనాయకులు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ కూడా రెడీ చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విశాఖ ఉక్కు.. కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు.. ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజకీయం ముమ్మరం చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె ఈ నెల 26న విశాఖ పట్నం రానున్నట్టు పార్టీ వర్గాలకు సమాచారం అందింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ఆమె నాయనమ్మ ఇందిరా గాంధీ హయాంలో ఏర్పడిన ఈ పరిశ్రమను మోడీ సర్కారు ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
దీనిని అడ్డుకునేందుకు ఇప్పటికే ఉద్యోగులు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని నిర్మించి కొనసాగిస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని.. కాంగ్రెస్ పుంజుకునేలా ప్రియాంక ఇక్కడ భారీ సభలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఇక, రెండోది అమరావతి. ఏపీకి ఇప్పుడు రాజధాని లేకుండా పోయింది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధాని చేయగా.. వైసీపీ ప్రభుత్వం దానిని తోసిపుచ్చింది. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
ఇప్పుడు దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని, ఏపీ రాజధానిగా అమరావతికే మద్దతు ప్రకటించే క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ ఈ నెల 26నే అమరావతిలో పర్యటించేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడకూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పార్టీ నాయకులు సమాయత్తమ య్యారు. ఈ రెండు కీలక అంశాలపై పోరాటం చేయడం ద్వారా.. పార్టీని పుంజుకునేలా చేయడంతోపాటు.. ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా.. దక్కేలా చేయాలనేది పార్టీ వ్యూహంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత అతడి అరెస్టులపై పెద్ద రచ్చే కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై…
పెద్ది థియేటర్ రన్ ముగిసిపోయిన కథ. రేపు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఇక…
గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్…
టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…
చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…
సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…