తెలంగాణలో అధికారం దక్కించుకోవాలన్న కలలను సాకారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. సుదీర్ఘ విరామం తర్వాత.. సక్సెస్ అయింది. తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇక, వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ప్రధాన సమస్యలను ఆలంబనగా చేసుకుని ఏపీలో చక్రం తిప్పేందుకు.. కాంగ్రెస్ అగ్రనాయకులు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ కూడా రెడీ చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విశాఖ ఉక్కు.. కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు.. ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాజకీయం ముమ్మరం చేయనున్నారు. ఈ క్రమంలో ఆమె ఈ నెల 26న విశాఖ పట్నం రానున్నట్టు పార్టీ వర్గాలకు సమాచారం అందింది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో ఆమె నాయనమ్మ ఇందిరా గాంధీ హయాంలో ఏర్పడిన ఈ పరిశ్రమను మోడీ సర్కారు ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
దీనిని అడ్డుకునేందుకు ఇప్పటికే ఉద్యోగులు వివిధ రూపాల్లో ఉద్యమాన్ని నిర్మించి కొనసాగిస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని.. కాంగ్రెస్ పుంజుకునేలా ప్రియాంక ఇక్కడ భారీ సభలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఇక, రెండోది అమరావతి. ఏపీకి ఇప్పుడు రాజధాని లేకుండా పోయింది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధాని చేయగా.. వైసీపీ ప్రభుత్వం దానిని తోసిపుచ్చింది. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
ఇప్పుడు దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని, ఏపీ రాజధానిగా అమరావతికే మద్దతు ప్రకటించే క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ ఈ నెల 26నే అమరావతిలో పర్యటించేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడకూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పార్టీ నాయకులు సమాయత్తమ య్యారు. ఈ రెండు కీలక అంశాలపై పోరాటం చేయడం ద్వారా.. పార్టీని పుంజుకునేలా చేయడంతోపాటు.. ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా.. దక్కేలా చేయాలనేది పార్టీ వ్యూహంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 12, 2023 3:50 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…