Political News

బీసీ బంధుకు బ్రేక్

గత ప్రభుత్వంలో ఎంతో వివాదాస్పదమైన పథకాల్లో ఒకటైన బీసీ బంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది. పథకం అమలులో వచ్చిన అనేక ఆరోపణలపై సమీక్షలు జరిపేందుకే పథకాన్ని తాత్కాలికంగా నిలిపినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పథకం అమలులో వచ్చిన ఆరోపణలను సమీక్షించి, ప్రజల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. సమీక్షల సందర్భంగా ఆరోపణలను, ఫీడ్ బ్యాక్ ను చర్చించి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్నీ కోణాల్లో రివ్యూ చేసిన తర్వాత పథకాన్ని మళ్ళీ పునరుద్దరిస్తామన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ హయాంలో బీసీ బంధుపై అనేక ఆరోపణలొచ్చాయి. బీఆర్ఎస్ ఓటమికి బీసీబంధు పథకం కూడా ఒక కారణమనే చెప్పాలి. ఎలాగంటే మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు పథకం అమలులో తమిష్టం వచ్చినట్లుగానే లబ్దిదారులను ఎంపికచేశారనే ఆరోపణలు బాగా వినిపించాయి. నిజమైన అర్హులను వదిలేసి అనర్హులను లబ్దిదారులుగా ఎంపికచేసేనట్లు అప్పట్లో బాగా గోలజరిగింది. అయినా కేసీయార్, కేటీయార్ పట్టించుకోలేదు.

ఇక మంత్రులు, ఎంఎల్ఏలైతే అవినీతి, అరాచకాలతో ఆకాహమే హద్దుగా చెలరేగిపోయారు. దాంతో అప్పట్లోనే పథకం అమలుపై బాగా గొడవలయ్యాయి. అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులను అడ్డంపెట్టుకుని తాము ఎంపికచేసిన వారికి పథకం లబ్దిఅందేట్లుగా చర్యలు తీసుకున్నారు. దాని ప్రభావం సరిగ్గా ఎన్నికల సమయంలో బయటపడింది. ఎన్నికల్లో అభ్యర్ధులుగా ఎంపికైన వారు, సిట్టింగ్ ఎంఎల్ఏలు ప్రచారానికి వచ్చారు. అప్పుడు వాళ్ళపైన జనాలు తమ ఆగ్రహమంతా చూపించారు. చాలా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంఎల్ఏలను జనాలు అనేక కారణాలతో ప్రచారానికి కూడా అడుగుపెట్టనీయలేదు.

అనేక కారణాలతో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ బాధ్యతలు తీసుకోగానే ప్రజాదర్బార్ పేరుతో జనాలను కలవటం మొదలుపెట్టారు. రోజుకు సుమారు 4 వేలమంది రేవంత్ ను కలిసి తమ బాధలను చెప్పుకుంటున్నారు. రేవంత్ ను కలిసి బాధలను, సమస్యలను చెప్పుకుంటున్నవారిలో బీసీ బంధు గురించే ఎక్కువమందున్నారట. అందుకనే పథకం అమలును వెంటనే ఆపేయాలని రేవంత్ ఆదేశించారు. దాంతో ఉన్నతాధికారులు పథకం అమలును నిలిపేశారు. మంత్రి ఆధ్వర్యంలో ఉన్నతాదికారులు లబ్దిదారుల ఎంపికను సమీక్షంచనున్నారు. రివ్యూల తర్వాత బీసీ బంధు ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

This post was last modified on December 12, 2023 3:25 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అమెరికాలో వెంటాడిన మృత్యువు

తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…

19 mins ago

కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…

22 mins ago

ప్రభాస్ ఊరిస్తోంది దేని గురించంటే

ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…

1 hour ago

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

2 hours ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

3 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

5 hours ago